Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో డేటా సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ ఓకే

Webdunia
గురువారం, 22 జులై 2021 (09:40 IST)
ఇటీవల హైదరాబాద్ నగరంలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఓ డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇపుడు మైక్రోసాఫ్ట్ ఇండియా ముందుకు వచ్చింది. ఈ కేంద్రాన్ని రూ.1500 కోట్ల వ్యయంతో నెలకొల్పనున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో దీన్ని ఏర్పాటు చేస్తారు. 
 
ఈ మేరకు ప్రభుత్వంతో ఆ సంస్థ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. చర్చలు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.
 
ఇదిలావుంటే, మరోమూడు ఐటీ కంపెనీలు కూడా ఇదే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మన దేశంలో ఉన్న డేటా సెంటర్ల సామర్థ్యం 30 మెగావాట్లువుండగా, 2023 నాటికి ఈ సామర్థ్యం 96 మెగావాట్లకు పెరుగుతుందని కన్సల్టింగ్ సేవల సంస్థ జేఎల్ఎల్ అంచనా వేసింది.
 
ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యయాలు తక్కువగా ఉండటానికి తోడు ప్రభుత్వ సానుకూల విధానాలు, ఐటీ నిపుణుల లభ్యత ఎక్కువగా ఉండడం వల్లే ఇక్కడ డేటా కేంద్రాల ఏర్పాటుకు కంపెనీలు ముందుకొస్తున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahavatar Narasimha: మహావతార్ నరసింహను పవన్ కళ్యాణ్ చూస్తారనుకుంటా.. అల్లు అరవింద్

Raashii Khanna : బాలీవుడ్ ప్రాజెక్టును కైవసం చేసుకున్న రాశిఖన్నా

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న మహావతార్ నరసింహ మూవీ పోస్టర్లు... కలెక్షన్లు అదుర్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments