Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంఐ బంపర్ ఆఫర్... స్మార్ట్‌ఫోన్ల‌ ఎక్స్ఛేంజ్

చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ షియోమీ భారతదేశంలో తమ మొబైల్ మార్కెట్‌ను మరింతగా పెంచుకునేందుకు దృష్టిసారించింది. ఇందులోభాగంగా, భారత మొబైల్ యూజర్లకు ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది.

Webdunia
బుధవారం, 22 నవంబరు 2017 (15:20 IST)
చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ షియోమీ భారతదేశంలో తమ మొబైల్ మార్కెట్‌ను మరింతగా పెంచుకునేందుకు దృష్టిసారించింది. ఇందులోభాగంగా, భారత మొబైల్ యూజర్లకు ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. దేశంలో ఎక్స్ఛేంజ్ ద్వారా ఎంఐ స్మార్ట్‌ఫోన్ల‌ను సొంతం చేసుకునే సదుపాయాన్ని తొలిసారి కల్పించింది.
 
ఇందుకోసం న్యూఢిల్లీకి చెందిన క్యాషిఫై అనే సంస్థ‌తో ఒప్పందం చేసుకుంది. ఈ సౌక‌ర్యం ద్వారా భార‌త వినియోగ‌దారులు త‌మ పాత ఫోన్ల‌ను ఎంఐ స్టోర్‌లో ఇచ్చేసి, కొత్త ఎంఐ స్మార్ట్‌ఫోన్ పొంద‌వ‌చ్చు. అయితే పాత ఫోన్ల‌కు ఎంత ధ‌ర నిర్ణ‌యించాల‌నే హ‌క్కును షియోమి, క్యాషిఫై సంస్థ‌కు అప్ప‌గించింది.
 
వారు నిర్ణ‌యించిన ధ‌ర‌కు అనుగుణంగా, కొత్త ఎంఐ ఫోన్ ధ‌ర‌లో డిస్కౌంట్ ఇస్తారు. మీ పాత మొబైల్ విలువ ఎంత ఉంటుందో క్యాషిఫై యాప్ ద్వారా కూడా తెలుసుకోవ‌చ్చు. క్యాషిఫై వారి ఎక్స్చేంజ్ ధ‌ర న‌చ్చిన వారు త‌మ మొబైల్ ఫోన్‌ను ఇచ్చేసి, కొత్తగా ఎంఐ స్మార్ట్‌ఫోన్‌ను పొందవచ్చు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments