Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియా ప్రభావం.. వార్తాపత్రికలు చదివేదీ లేదు.. టీవీల్లో వార్తలు చూసేదీ లేదు!

సోషల్ మీడియా ప్రభావంతో వార్తా పత్రికలు, న్యూస్ ఛానళ్లు చూడటం, న్యూస్ పేపర్లు చదవడం బాగా తగ్గిపోయినట్లు తాజా అధ్యయనంలో తేలింది.

Webdunia
గురువారం, 16 జూన్ 2016 (15:25 IST)
సోషల్ మీడియా ప్రభావంతో వార్తా పత్రికలు, న్యూస్ ఛానళ్లు చూడటం, న్యూస్ పేపర్లు చదవడం బాగా తగ్గిపోయినట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఒకప్పుడు ఫోటోలు షేర్ చేయడం, చాటింగ్ చేయడం వరకే పరిమితమైన సోషల్ మీడియా.. ప్రస్తుతం రోజువారీ అప్ డేట్స్ కోసం సోషల్ మీడియాపై ఆధారపడే స్థాయికి పెరిగింది. 
 
బ్రిటన్‌కు చెందిన ఓ సంస్థ యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాలకు చెందిన 26 దేశాల్లోని ఆన్ లైన్ యూజర్లపై చేసిన అధ్యయనంలో ఆసక్తకికరమైన అధ్యయనంలో.. ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్‌తో పాటు వాట్సాప్, స్నాప్ చాట్ తదితర సామాజిక మాధ్యమాల వాడకం ఈ మధ్య కాలంలో బాగా పెరిగిందని తేలింది. ఇంకా వార్తలు, తాజా విశేషాల కోసం సోషల్ మీడియా సైట్ల వాడకం విపరీతంగా పెరిగిందని తాజా పరిశోధనలో వెల్లడైంది. 
 
గతంలో కేవలం ఫొటోలు పోస్ట్ చేయడం, చాటింగ్ చేయడానికి మాత్రమే సోషల్ మీడియాను వినియోగించేవారు. కానీ ఆన్‌లైన్ యూజర్లలో సగానికి సగం మంది రోజువారీ వార్తలు, అప్ డేట్స్‌ను సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటున్నారు. సోషల్ మీడియాలో చాలామంది యాక్టివ్‌గా ఉన్నారు. ఇందుకోసం ప్రత్యేక సమయం కూడా అక్కర్లేకపోవడంతో సోషల్ మీడియాను ఉపయోగించేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుందని అధ్యయనంలో తేలింది.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments