Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొబైల్ యూజర్లకు శుభవార్త చెప్పిన జియో

Webdunia
సోమవారం, 9 డిశెంబరు 2019 (09:24 IST)
తన ప్రీపెయిడ్ మొబైల్ యూజర్లకు రిలయన్స్ జియో శుభవార్త చెప్పింది. ఇటీవల మొబైల్ టారిఫ్‌లను జియో పెంచింది. పైగా, రెండు ప్లాన్లను ఎత్తివేసింది. అయితే, పెంచిన ధరలు ఎక్కువగా ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. పైగా, దిగువ తరగతి శ్రేణికి అందుబాటులో ఉన్న రెండు ప్లాన్లను రద్దు చేయడంపై కూడా విమర్శలు వచ్చాయి. దీంతో ఆ రద్దు చేసిన రెండు ప్లాన్లను తిరిగి ప్రవేశపెట్టింది. 
 
ఈ నేపథ్యంలో రూ.98, రూ.149 ప్లాన్ల‌ను మ‌ళ్లీ ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు తెలిపింది. ఈ మ‌ధ్యే పెంచిన మొబైల్ టారిఫ్‌ల‌కు అనుగుణంగా నూత‌న ప్లాన్ల‌ను లాంచ్ చేసిన జియో అంత‌కు ముందు ఉన్న రూ.98, రూ.149 ప్లాన్ల‌ను మ‌ళ్లీ అందుబాటులోకి తెచ్చిన‌ట్లు ప్ర‌క‌టించింది. 
 
ఇందులో రూ.98 ప్లాన్లను ఎంచుకునే యూజర్లకు 2 జీబీ డేటాతో పాటు.. 300 ఎంఎంఎస్‌లు, జియో టు జియో అన్‌లిమిటెడ్ కాల్స్‌ చేసుకోవచ్చు. ఆ ప్లాన్ కాలపరిమితి 28 రోజులు. ఇతర నెట్‌వర్క్ చేసుకునే కాల్స్‌కు నిమిషానికి ఆరు పైసలు చెప్పున వసూలు చేస్తారు. 
 
ఇకపోతే, రూ.149 ప్లాన్‌లో రోజుకు 1జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, జియో టు జియో అన్‌లిమిటెడ్ కాల్స్‌, 300 నిమిషాల నాన్ జియో కాల్స్ ల‌భిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీని 24 రోజులుగా నిర్ణ‌యించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments