భారత్‌లో అత్యంత బలమైన కార్పొరేట్ బ్రాండ్‌గా నిలిచిన జియో

సెల్వి
గురువారం, 18 జనవరి 2024 (12:01 IST)
రిలయన్స్‌ జియో భారత్‌లో అత్యంత బలమైన కార్పొరేట్ బ్రాండ్‌గా అవతరించింది. బ్రాండ్ ఫైనాన్స్ అనే సంస్థ 2024కు గాను విడుదల చేసిన గ్లోబల్‌ 500 లిస్ట్‌లోని భారత కంపెనీల్లో ఆసియా కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన టెలికాం సేవల సంస్థ రిలయన్స్‌ జియో వరుసగా రెండో ఏడాదీ అగ్రస్థానం దక్కించుకుంది.
 
అంతర్జాతీయ టెలికాం రంగంలో జియో కొత్త కంపెనీ అయినప్పటికీ, 610 కోట్ల డాలర్ల బ్రాండ్‌ విలువ (14 శాతం వృద్ధి)తో పాటు బ్రాండ్‌ సత్తా సూచీలో 89 పాయింట్ల స్కోర్‌, ట్రిపుల్‌ ఏ బ్రాండ్‌ రేటింగ్‌తో జియో శక్తిమంతమైన బ్రాండ్‌గా ఎదిగింది. 
 
కాగా, దేశంతోపాటు దక్షిణాసియాలో అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా గ్రూప్‌ నిలిచింది. ఇంకా ఐఫోన్‌ తయారీ దిగ్గజం యాపిల్‌ ప్రపంచంలో అత్యంత విలువైన బ్రాండ్‌గా ఉంది. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అమెజాన్‌, సామ్‌సంగ్‌ వరుసగా టాప్‌-5లో ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments