Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో సంక్రాంతి సెలవులు పొడగింపు.. ఎందుకో తెలుసా?

వరుణ్
గురువారం, 18 జనవరి 2024 (11:54 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు పొడగించారు. సంక్రాంతి సెలవుల తర్వాత అన్ని విద్యా సంస్థలు ఈ నెల 19వ తేదీన తెరుచుకోవాల్సివుంది. కానీ, ఏపీ విద్యాశాఖ మాత్రం ఈ సెలవులను మరో మూడు రోజుల పాటు పొడగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో పాఠశాలలు జనవరి 22వ తేదీన పునఃప్రారంభమవుతాయని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేశ్ కుమార్ వెల్లడించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
కానీ, ఏపీలో సంక్రాంతి సెలవులు పొడగించడాని ప్రధాన కారణం లేకపోలేదు. ఈ నెల 19వ తేదీన విజయవాడ ఎంజీ రోడ్డులో ఉన్న స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏపీ ప్రభుత్వం నిర్మించింది. దీని నిర్మాణ పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. కానీ, వచ్చే నెలలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. 
 
దీంతో హడావుడిగా ఈ స్మృతి వనాన్ని ప్రారంభించేందుకు ఏపీ సర్కారు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా, శుక్రవారం సీఎం జగన్ ఈ స్మృతి వనాన్ని ప్రారంభిస్తారు. ఇందుకోసం జనాలను తరలించేందుకు బస్సులు భారీ సంఖ్యలో అవసరమవుతాయి. దీంతో స్కూలు బస్సులన్నీ అటువైపు మళ్లించేందుకు వీలుగా పాఠశాలలకు ఇచ్చిన సంక్రాంతి సెలవులను మరో మూడు రోజుల పాటు పొడగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి సినిమాకు హోంవర్క్ చేస్తున్నా, నాగార్జునతో హలో బ్రదర్ లాంటి సినిమా చేస్తా : అనిల్ రావిపూడి

ఐటీ సోదాలు సహజమే... ఇవేమీ కొత్తకాదు : దిల్ రాజు

Tamannaah: తమన్నాను ఆంటీ అని పిలిచిన రవీనా టాండన్ కుమార్తె.. ఏమైందంటే?

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా రాబోతున్నాఅంటున్న నాగశౌర్య

'పుష్ప-2' రికార్డులన్నీ ఫేకా? లెక్కల నిగ్గు తేలుస్తున్న ఐటీ అధికారులు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

మహిళలకు మేలు చేసే మల్లె పువ్వులు.. అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..?

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

పాండ్స్ యూత్‌ఫుల్ మిరాకిల్ రేంజ్ లాంచ్

తర్వాతి కథనం