Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ చేసిన తొలి ట్వీట్ ఇదే...

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (11:06 IST)
ప్రముఖ సామాజిక మాధ్యమాల్లో ఒకటైన ట్విట్టర్‌ను ప్రపంచంలో ఎలక్ట్రిక్ కార్ల పరంగా మేటి సంస్థగా ఉన్న టెస్లా, అంతరిక్ష పరిశోధన, శాటిలైన్ కమ్యూనికేషన్ల సేవలో దూసుకునిపోతున్న స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. ట్విట్టర్‌ తన వశమైన తర్వాత ఆయన తొలి ట్వీట్ చేశారు. 
 
"స్వేచ్ఛగా మాట్లాడగలగడం ప్రజాస్వామ్యానికి పునాది. మానవాళి భవిష్యత్‌కు సంబంధించి కీలకమైన అంశాలకు చర్చా వేదికగా ట్విట్టర్ ఉంటుంది. ఇప్పటికంటే ట్విట్టర్‌ను మరింత మెరుగ్గా తయారు చేయడానికి సుముఖంగా ఉన్నాను. కొత్త ఫీచర్లు, విశ్వాసాన్ని పెంచడం కోసం ఆల్గోరిథమ్‌లను ఓపెన్ సోర్స్ చేస్తాం. స్పామ్ బాట్లను ఓడిస్తాం. ట్విట్టర్‌కు ఎంతో సత్తా ఉంది. దీన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు కంపెనీ, యూజర్లతో కలిసి పని చేస్తా" అని ట్విట్టర్ యజమానికి తొలి ట్వీట్ చేశారు. 
 
కాగా, ఎలాన్ మస్క్ ట్విట్టర్ ఖాతాను 8.7 కోట్ల మంది పాలో అవుతుంటారు. కొత్త సాంకేతికతలను ముందుగానే పసిగట్టగల మేధావిగా మస్క్‌కు గుర్తింపు ఉంది. 44 బిలియన్ డాలర్ల భారీ మొత్తానికి ట్విట్టర్‌ను చేజిక్కించుకున్న తర్వాత ఎలాన్ మస్క్ మొదటి ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments