Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటీ ఉద్యోగులకు శుభవార్త.. డిసెంబర్ 31 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ పొడిగింపు

Webdunia
బుధవారం, 22 జులై 2020 (13:26 IST)
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశంలోనూ రోజూ రోజుకీ కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పలు కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. చాలావరకు ఐటీ కంపెనీలు ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించాయి. తాజాగా కేంద్రం మరోసారి ఐటీ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 
 
ఐటీ, బీపీవో కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని డిసెంబర్ 31వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో మరికొన్ని నెలల పాటు 'వర్క్ ఫ్రం హోం' సౌకర్యాన్ని కేంద్రం పొడిగించింది.
 
గతంలో విధించిన గడువు జూలై 31తో ముగుస్తున్న తరుణంలో... కోవిడ్‌-19 కారణంగా ప్రజల్లో నెలకొన్న భయాందోళనను దృష్టిలో ఉంచుకొని ఇంటి నుంచి పనిచేసే విధానాన్ని 2020 డిసెంబర్‌ 31 వరకు పొడిగిస్తూ సర్వీసు ప్రొవైడర్లకు నిబంధనలు, షరతులలో డాట్‌ సడలింపులు ఇచ్చిందని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్స్‌ ట్వీట్‌ చేసింది.
 
భారత్‌లో ప్రస్తుతం 85శాతం మంది ఐటీ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే అవకాశం కల్పించారు. చాలా కొద్ది మంది మాత్రమే ఆఫీసులకు వెళ్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఐటీ ఉద్యోగులు కరోనా ముప్పు నుంచి తప్పుకోవచ్చునని ఐటీ శాఖ భావిస్తోంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments