బగ్ ఉన్నట్టు గుర్తిస్తే రూ.25 లక్షలు ఇస్తాం : గూగుల్

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2022 (14:25 IST)
సెక్యూరిటీ పరిశోధకులకు గూగుల్ ఓ సవాల్ విసిరింది. తన ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ ‌గూగుల్ ఓఎస్ఎస్‌లో బగ్స్‌ను గుర్తించి చెప్పినవారికి 31,337 డాలర్లు (రూ.25 లక్షల) బహుమతి ఇస్తామని ప్రకటించింది. ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌లో గుర్తించిన ప్రతి లోపానికి ఇంత మొత్తం రాదు. దాని తీవ్రత ఆధారంగా ఇచ్చే మొత్తం 100 డాలర్ల నుంచి 31,337 డాలర్ల వరకు ఉంటుంది. 
 
ఈ కార్యక్రమానికి బంగ్ బౌంటీ పోగ్రామ్ అని గూగుల్ పేరు పెట్టింది. పరిశోధనలకు ప్రోత్సహించినట్టు తెలిపింది. నిబంధనలు జాగ్రత్తగా చదవాలని కోరింది. ఒకవేళ గుర్తించిన లోపం అసాధారణంగా ఉంటే వారితో కలిసి పని చేస్తామని గూగుల్ ప్రకటించింది. 
 
నగదు బహుమానానికి అదనంగా, ప్రజా గుర్తింపు కూడా లభిస్తుందని పేర్కొంది. నగదు బహుమతి గెలుచుకున్న వారు ఆ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇస్తే రెట్టింపు మొత్తాన్ని అందిస్తామని గూగుల్ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

Ramcharan: పెద్ది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అవుతోంది రాసిపెట్టుకోండి.: రామ్ చరణ్

తర్వాతి కథనం
Show comments