Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్ ఉద్యోగికి కరోనా .. వర్క్ ఫ్రమ్ హోంకు ఆదేశాలు

Webdunia
శుక్రవారం, 13 మార్చి 2020 (10:45 IST)
కరోనా వైరస్ వైరస్.. ఏ ఒక్క రంగాన్ని వదిలిపెట్టడం లేదు. కోళ్ళ పరిశ్రమ నుంచి ఐటీ సెక్టార్ వరకు ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందన్న విస్తృత ప్రచారంతో పౌల్ట్రీ పరిశ్రమ కోలుకోలేని విధంగా నష్టపోయింది. ఇపుడు ఐటీ రంగం కూడా కరోనా దెబ్బకు కుదేలైపోతోంది. తాజాగా గూగుల్ ఉద్యోగికి కరోనా వైరస్ సోకింది. దీంతో గూగుల్ ఉద్యోగులంతా ఇంటి నుంచి పని చేయాలంటూ ఆదేశాలు జారీచేశారు.
 
బెంగళూరు నగరంలో గూగుల్ కార్యాలయం ఉంది. ఇక్కడ పని చేస్తున్న ఉద్యోగుల్లో ఒకరికి కరోనా వైరస్ వచ్చిందని శుక్రవారం ఉదయం నిర్ధారణ అయింది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా బెంగళూరు గూగుల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులను శుక్రవారం ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. 
 
'శుక్రవారం బెంగళూరులోని మా గూగుల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా వైరస్ పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది. దీంతో అతన్ని ఐసోలేషన్ వార్డుకు తరలించాం. ముందు జాగ్రత్త చర్యగా మా ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం చేయాలని కోరాం' అని గూగుల్ యాజమాన్యం ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 
 
కరోనా వైరస్ సోకిన ఉద్యోగితో సన్నిహితంగా మెలిగిన ఉద్యోగులను కూడా క్వారంటైన్ చేశామని, వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నామని గూగుల్ తెలిపింది. ప్రజారోగ్యం దృష్ట్యా తాము ఇంటి నుంచే పనిచేయాలని తమ ఉద్యోగులను ఆదేశించామని గూగుల్ వివరించింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 73కు చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments