Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13మంది మృతి

Advertiesment
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13మంది మృతి
, శుక్రవారం, 6 మార్చి 2020 (10:48 IST)
కర్ణాటకలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో 13మంది ప్రాణాలు కోల్పోయారు. తుమ్కూరు జిల్లా.. బలడ్కేర్ వద్ద బెంగుళూరు, మంగుళూర్ హైవేపై ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ధర్మస్థల్ నుంచి వస్తున్ననలుగురు యువకుల బ్రెజా కారు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. 
 
అదే సమయంలో తమిళనాడు నుంచి వస్తున్న టవేరా కారు.. పల్టీలు కొట్టిన కారును బలంగా ఢీకొట్టడంతో రెండు కార్లలో ప్రయాణిస్తున్న మొత్తం 13 మంది అక్కడికక్కడే తీవ్రగాయాలతో మృతిచెందారు. 
 
మరణించిన వారిలో నలుగురు కర్ణాటకు చెందినవారు కాగా.. 9 మంది తమిళనాడుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో ఫైర్ నెట్ చార్జీల బాదుడు