జియోనీ మ్యాక్స్ పేరిట.. బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. ఆగస్టు 25న విడుదల

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (11:12 IST)
Gionee F9 Plus
జియోనీ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్లు భారత్‌ మార్కెట్లోకి రానున్నాయి. జియోనీ మ్యాక్స్ అనే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ త్వరలో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని ఫ్లిప్ కార్ట్ ప్రత్యేక పేజీ ద్వారా తెలిపింది. ఈ ఫోను ధర రూ.6వేలుగా వుండొచ్చునని ఫ్లిఫ్ కార్ట్ వెల్లడించింది. గతేడాది సెప్టెంబర్‌లో జియోనీ ఎఫ్9 ప్లస్ అనే స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఆ తర్వాత ఇంకో స్మార్ట్ ఫోన్ జియోనీ నుంచి రాలేదు.
 
తాజాగా జియోనీ మ్యాక్స్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. ఇందులో భాగంగా ఫ్లిప్ కార్ట్ దీనికి సంబంధించిన టీజర్ పేజీని కూడా తీసుకువచ్చింది. ఈ ఫోన్ ఆగస్టు 25వ తేదీన లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ నేరుగా ఫ్లిప్ కార్ట్‌లోనే లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా ఫ్లిప్ కార్ట్ షేర్ చేసింది. 
 
ఫీచర్లు ఏంటంటే?
వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్ ప్లే
4500 ఎంఏహెచ్ బ్యాటరీ వుంటుందని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhandoraa Title Song: దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ విడుదల.. నిను మోసినా న‌ను మోసినా..

వెంకీ మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మన శంకర వర ప్రసాద్ గారు

DVS Raju: డీవీఎస్ రాజు 97వ జయంతి వేడుకలు.. ఎన్టీఆర్‌తో ఎన్నో?

వృష‌భ‌ నుంచి తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెలియజేసే అప్పా సాంగ్ రిలీజ్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9.. ఈ షో విజేత ఎవరంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments