జియోనీ సంచలనం: ఫుల్ ఛార్జ్ చేస్తే 2,3 రోజులకు ఛార్జింగ్ అవసరం లేదు..

Webdunia
గురువారం, 30 జులై 2020 (11:54 IST)
Gionee
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనాలు సృష్టించేందుకు కంపెనీలు పోటీపడుతున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ను 20 నిమిషాల్లో 100 పర్సెంట్ ఛార్జింగ్ చేసే టెక్నాలజీని రియల్‌మీ రూపొందించింది.

6,000ఎంఏహెచ్ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చేందుకు శాంసంగ్ రంగం సిద్ధం చేసింది. ఇప్పుడు జియోనీ సంచలనం సృష్టించేందుకు సిద్ధమైంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే కనీసం మూడు నాలుగు రోజులు ఛార్జింగ్ అవసరం లేకుండా వాడుకోవచ్చు. 
 
ఏకంగా 10,000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో స్మార్ట్‌ఫోన్ తీసుకొస్తోంది జియోనీ. ఇంత భారీ కెపాసిటీతో స్మార్ట్‌ఫోన్ రావడమంటే సంచలనం. ఇప్పటికే ఔకిటెల్ కే 10000 ప్రో స్మార్ట్‌ఫోన్ కూడా ఇంత బ్యాటరీ కెపాసిటీతో స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఇప్పుడు జియోనీ నుంచి 10,000ఎంఏహెచ్ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్ వస్తోంది. ఇప్పటికే చైనాలో అప్రూవల్ లభించింది.
 
ఇక ఈ ఫోన్ ఇతర స్పెసిఫికేషన్స్ చూస్తే మీడియాటెక్ హీలియో ప్రాసెసర్, 4జీబీ, 6జీబీ, 8జీబీ ర్యామ్, 64జీబీ, 128జీబీ, 256జీబీ స్టోరేజీ, 5.72 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే, 16మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా లాంటి ప్రత్యేకతలున్నాయి. ఆగస్టులో ఈ ఫోన్ లాంఛ్ అయ్యే అవకాశముంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జబర్దస్త్ నుంచి అందుకే వచ్చేశాను.. రష్మీ-సుధీర్ లవ్ ట్రాక్ గురించి చమ్మక్ చంద్ర ఏమన్నారు?

Vaishnavi: పురుష: నుంచి హీరోయిన్ వైష్ణవి పాత్ర ఫస్ట్ లుక్

ఛాంపియన్ కథ విన్నప్పుడు ఎమోషనల్ గా అనిపించింది : అనస్వర రాజన్

Jin: జిన్ లాంటి కొత్త ప్రయోగాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా : నిఖిల్ ఎం. గౌడ

SS Rajamouli: ఎస్‌ఎస్ రాజమౌళి పై జేమ్స్ కామెరాన్ కామెంట్ వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ తింటే?

దేశ తొలి మిస్ ఇండియా మెహర్ ఇకలేరు...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

గాజువాక ప్రభుత్వ పాఠశాలలో నాట్స్ సాయంతో గ్రీన్ స్టూడియో

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

తర్వాతి కథనం
Show comments