Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయకపోతే.. రూ.10వేలు జరిమానా (video)

Webdunia
బుధవారం, 10 జూన్ 2020 (20:39 IST)
పా న్ కార్డుతో ఆధార్ లింక్ చేయకపోతే.. రూ.10వేల జరిమానా విధించేందుకు రంగం సిద్ధం అవుతోంది. పాన్ ఆధార్ లింక్ చేయాలని ఇప్పటికే ఆదాయ పన్ను శాఖ ఈ నెల 30వ తేదీ వరకు గడువు విధించింది. పాన్ కార్డును ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తే.. ఆధార్ కార్డును యూఐడీఏఐ జారీ చేస్తుంది. అయితే ఈ రెండు కార్డులను కచ్చితంగా అనుసంధానం చేసుకోవాలిని అధికారులు సూచిస్తున్నారు.
 
కేంద్ర ప్రభుత్వం మరోసారి పాన్, ఆధార్ అనుసంధాన గడువును పొడిగించింది. ఇప్పటికే గడువు చాలా సార్లు పొడిగించుకుంటూ వచ్చింది. ఇప్పుడు పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్‌కు జూన్ 30 డెడ్‌లైన్‌గా ఉందన్నారు. ఈలోపు రెండింటినీ లింక్ చేసుకోవాలి. పాన్, ఆధార్ అనుసంధానానికి రెండు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
 
ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌కు వెళ్లి పాన్, ఆధార్ నెంబర్లను లింక్ చేసుకోవచ్చు. నిర్ణీత గడువులోగా పాన్, ఆధార్ నెంబర్లను లింక్ చేసుకోకపోతే.. పాన్ నెంబర్ పని చేయదు. తర్వాత ఆదాయపు పన్ను శాఖ నుంచి సమస్యలు వస్తాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272బీ సెక్షన్ కింద రూ.10,000 జరిమానా ఎదుర్కోవలసి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

బెంగుళూరులో సీనియర్ నటి సరోజా దేవి (87) మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments