Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయకపోతే.. రూ.10వేలు జరిమానా (video)

Webdunia
బుధవారం, 10 జూన్ 2020 (20:39 IST)
పా న్ కార్డుతో ఆధార్ లింక్ చేయకపోతే.. రూ.10వేల జరిమానా విధించేందుకు రంగం సిద్ధం అవుతోంది. పాన్ ఆధార్ లింక్ చేయాలని ఇప్పటికే ఆదాయ పన్ను శాఖ ఈ నెల 30వ తేదీ వరకు గడువు విధించింది. పాన్ కార్డును ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తే.. ఆధార్ కార్డును యూఐడీఏఐ జారీ చేస్తుంది. అయితే ఈ రెండు కార్డులను కచ్చితంగా అనుసంధానం చేసుకోవాలిని అధికారులు సూచిస్తున్నారు.
 
కేంద్ర ప్రభుత్వం మరోసారి పాన్, ఆధార్ అనుసంధాన గడువును పొడిగించింది. ఇప్పటికే గడువు చాలా సార్లు పొడిగించుకుంటూ వచ్చింది. ఇప్పుడు పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ లింక్‌కు జూన్ 30 డెడ్‌లైన్‌గా ఉందన్నారు. ఈలోపు రెండింటినీ లింక్ చేసుకోవాలి. పాన్, ఆధార్ అనుసంధానానికి రెండు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.
 
ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌కు వెళ్లి పాన్, ఆధార్ నెంబర్లను లింక్ చేసుకోవచ్చు. నిర్ణీత గడువులోగా పాన్, ఆధార్ నెంబర్లను లింక్ చేసుకోకపోతే.. పాన్ నెంబర్ పని చేయదు. తర్వాత ఆదాయపు పన్ను శాఖ నుంచి సమస్యలు వస్తాయి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272బీ సెక్షన్ కింద రూ.10,000 జరిమానా ఎదుర్కోవలసి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments