ఫేస్‌బుక్ మరో కీలక నిర్ణయం... ఫేస్‌బుక్ లైవ్‌పై ఆంక్షలు

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (18:20 IST)
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు ఈ మధ్య కాలంలో వరుస ఎదురుదెబ్బలు తగులుతుండటంతో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఫేస్‌బుక్ లైవ్‌లను పర్యవేక్షించనుంది. ఈ మేరకు లైవ్‌లో కొన్ని ఆంక్షలు కూడా విధించాలని కూడా ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ సీవోవో షెరిల్ శాండ్‌బెర్గ్ వెల్లడించారు.
 
ప్రామాణిక అంశాలపై ఆధారపడి ఫేస్‌బుక్‌లో ఎవరెవరు లైవ్‌కు వెళ్లవచ్చు అనే విషయాన్ని ఫేస్‌బుక్ పరిశీలిస్తోందని ఆమె తన బ్లాగ్‌లో వెల్లడించారు. కాగా ఇటీవల న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన నరమేధం ఫేస్‌బుక్‌లో లైవ్ అయింది. ఈ సంఘటనతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగడంతో తమ మాధ్యమంలో మరిన్ని ఆంక్షలు విధించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా లైవ్‌లు, రెచ్చగొట్టే ప్రసంగాలపై ఆంక్షలను విధించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమాపై అవగాహన లేని వ్యక్తికి సినిమాటోగ్రఫీ శాఖనా? సీఎం విజయ్‌పై విశాల్ ఫైర్

రజనీకాంత్‌తో పోటీపడతాను.. అసూయ లేదు : కమల్ హాసన్

నడిరోడ్డుపై నటి పావలా శ్యామల - నిర్మాత దిల్ రాజు పెద్ద మనసు

పెద్ది చిత్రం మల్లయోధుడు కోడి బయోపిక్ కాదు : డైరెక్టర్ బుచ్చిబాబు

నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు, నా ఇగో హర్ట్ అయ్యింది: రజినీకాంత్

తర్వాతి కథనం
Show comments