Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో తొలిసారి 5జీ : 3 మిల్లీ సెకన్లలో 5.7 జీబీపీఎస్

భారత్‌లో తొలిసారి 5జీ సేవలను ఎరిక్‌సన్ సంస్థ పరిచయం చేసింది. ఈ రేడియో తరంగాలు ఏం చేయగలవో తొలిసారి లైవ్ చేసి చూపించింది. 3 మిల్లీ సెకన్లు... అంటే కనీసం రెప్పపాటు సమయం కూడా కాదు.

Webdunia
ఆదివారం, 19 నవంబరు 2017 (13:27 IST)
భారత్‌లో తొలిసారి 5జీ సేవలను ఎరిక్‌సన్ సంస్థ పరిచయం చేసింది. ఈ రేడియో తరంగాలు ఏం చేయగలవో తొలిసారి లైవ్ చేసి చూపించింది. 3 మిల్లీ సెకన్లు... అంటే కనీసం రెప్పపాటు సమయం కూడా కాదు. అంత తక్కువ సమయంలో ఏం చేస్తాం? 5వ తరం రేడియో తరంగాలు ఏం చేయగలవో ఇండియాలో తొలిసారిగా లైవ్ చూపించింది ఎరిక్ సన్ సంస్థ. 
 
తమ 5జీ టెస్ట్ బెడ్‌పై సెకనులో 3వ వంతు కన్నా తక్కువ సమయంలో 5.7 జీబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్‌ను చూపి ఓ అద్భుతాన్ని కళ్లముందు చూపింది. భారత మార్కెట్లో 2026 నాటికి 5జీ సాంకేతికత 27.3 బిలియన్ డాలర్ల వ్యాపారం నమోదు చేసేంత స్థాయికి చేరుతుందని అంచనా వేస్తున్నట్టు ఎరిక్ సన్ సంస్థ పేర్కొంది. 
 
భారత మార్కెట్లో తమ సంస్థ తొలిసారిగా లైవ్ 5జీ స్పీడ్‌ను చూపించిందని తెలిపింది. భారత మార్కెట్లో అపార వ్యాపారావకాశాలు ఉన్నాయని, సాధ్యమైనంత ఎక్కువ మార్కెట్ వాటాను నమోదు చేయడమే తమ లక్ష్యమని ఎరిక్ సన్, మార్కెట్ ఏరియా హెడ్ నుంజియో మిర్టిల్లో వ్యాఖ్యానించారు. భారత్‌లో మరో రెండేళ్లలో 5జీ సేవలను తాము ప్రారంభించనున్నామని తెలిపారు.
 
ఇండియాలో గిగాబిట్ ఎల్టీఈ విస్తరణ కోసం తాము వేచి చూస్తున్నామని తెలిపారు. 5జీ తరంగాలు అందుబాటులోకి వస్తే, ఇప్పుడున్న టెలికం ఆదాయం 43 శాతం మేరకు పెరుగుతుందని ఎరిక్ సన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ నితిన్ బన్సాల్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments