Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్కపూట భోజనానికే రూ.32,000 ఖర్చు : ఎలాన్ మస్క్

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2022 (11:20 IST)
ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ సంచలన విషయాలను బహిర్గతం చేస్తున్నారు. ట్విట్టర్‌ను భారీ మొత్తానికి కొనుగోలు చేసిన తర్వాత ఆయన ఉద్యోగుల సంక్షేమం కోసం ఖర్చు చేసే మొత్తం ఖర్చు వివరాలను వెల్లడించారు. తాజాగా ట్విట్టర్ ఉద్యోగులకు మధ్యాహ్నం భోజనం కోసమే రూ.32 వేలను ఖర్చు చేసినట్టు తెలిపారు. పనిలోపనిగా మరో 4400 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను ఆయన తొలగించారు. 
 
ఇప్పటివరకు ట్విట్టర్ ఉద్యోగులకు భోజనం ఉచితంగా అందిస్తున్నారు. 12 నెలల కాలానికి 400 మిలియన్ డాలర్లను ఖర్చు చేసినట్టు ఆయన వెల్లడించారు. అంటే ఒక్కో ఉద్యోగికి రోజుకు దాదాపుగా రూ.32000ను ఖర్చు చేసినట్టు వివరించారు. ముఖ్యంగా శాన్‌ఫ్రాన్సిస్కో ట్విట్టర్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే తక్కువ మంది ఉద్యోగులకు ఎక్కువ విలువైన భోజనం అందించడాన్ని ఆయన హెలైట్ చేశారు. 
 
అయితే, ఎలాన్ మస్క్ తాజాగా విడుదల చేసిన ఈ వివరాలపై ఆ సంస్థ ఉద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. కొత్త యజమాని అన్ని అబద్దాలు చెబుతున్నారని ట్విట్టర్ మాజీ ఉద్యోగి ట్రసీ హాకిన్స్ మండిపడ్డారు. పైగా, ఎలాన్ మస్క్ నాయకత్వంలో పని చేయడం తమకు ఇష్టం లేదని తాను ఉద్యోగానికి రాజీనామా చేసినట్టు ఆయన తెలిపారు. ఈ ప్రోగ్రామ్‌ను తాను పర్యవేక్షించాని, ఒక ఉద్యోగికి రోజుకి సగటున ఆహారం కోసం 20 నుంచి 25 డాలర్ల మేరకు మాత్రమే ఖర్చు చేసినట్టు ఎలాన్ మస్క్‌కు సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments