Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌ నూతన ప్రైవసీ విధానం.. ఏకపక్షంగా రుద్దడం ఆందోళనకరం

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (13:47 IST)
వాట్సాప్‌ నూతన ప్రైవసీ విధానాన్ని ఎంచుకునే విషయంలో యూరోపియన్‌ యూజర్లతో పోలిస్తే భారత యూజర్ల పట్ల మెసేజింగ్‌ యాప్‌ భిన్నంగా వ్యవహరిస్తోందని కేంద్ర ప్రభుత్వం సోమవారం ఢిల్లీ హైకోర్టుకు వివరించింది. భారత యూజర్లపై వాట్సాప్‌ తన ప్రైవసీ పాలసీలో మార్పును ఏకపక్షంగా రుద్దడం ఆందోళనకరమని కేంద్రం పేర్కొంది. 
 
ఫేస్‌బుక్‌ నేతృత్వంలోని వాట్సాప్‌ నూతన ప్రైవసీ విధానానికి వ్యతిరేకంగా ఓ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా అదనపు సొలిసిటర్‌ జనరల్‌ చేతన్‌ శర్మ న్యాయమూర్తి సంజీవ్‌ సచ్‌దేవ్‌ ఎదుట ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు.
 
తమ డేటాను ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ల్లో షేర్‌ చేయకుండా ఉండే అవకాశాన్ని భారత యూజర్లకు ఇవ్వకపోవడాన్ని శర్మ ఆక్షేపించారు. ఇది యూజర్ల సమాచార గోప్యత, సమాచార భద్రతకు భంగకరమని కోర్టుకు నివేదించారు. 
 
దీనిపై ప్రభుత్వం ఇప్పటికే నిర్థిష్ట సమాచారం అందచేయాలని వాట్సాప్‌ను కోరిందని తెలిపారు. ప్రభుత్వం కోరిన వివరాలపై త్వరలోనే స్పందిస్తామని వాట్సాప్‌ తరపు న్యాయవాది కపిల్‌ సిబల్‌ పేర్కొన్నారు. దీంతో ఈ పిటిషన్‌పై విచారణను హైకోర్టు మార్చి1కి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments