Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొబైల్‌ ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. సిమ్ మార్చాలంటే..?

Webdunia
మంగళవారం, 25 మే 2021 (12:52 IST)
మొబైల్‌ ఫోన్‌ యూజర్లకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. పోస్ట్‌ పెయిడ్‌ నుంచి ప్రీ పెయిడ్‌కు లేదా ప్రీ పెయిడ్‌ నుంచి పోస్ట్‌ పెయిడ్‌కు మారాలంటే ఇకపై సిమ్‌ మార్చాల్సిన అవసరం లేదు. కేవలం ఓ ఓటీపీ(వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌) ద్వారా మార్చుకోవచ్చు. 
 
ఈ ప్రక్రియ జరిగేలా టెలికం శాఖకు (డాట్‌) టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ ప్రతిపాదించింది. దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసి, ఆధారాలు (పీవోసీ) ఇవ్వాలంటూ టెలికం ఆపరేటర్లకు డాట్‌ సూచించింది. పీవోసీని బట్టి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు డాట్‌ ఏడీజీ ఓ నోట్‌లో తెలిపారు.
 
టెల్కోల ప్రతిపాదన ప్రకారం.. కనెక్షన్‌ను మార్చుకోదల్చుకున్న వారు తమ సర్వీస్‌ ప్రొవైడర్‌కు ఎస్‌ఎంఎస్, ఐవీఆర్‌ఎస్, వెబ్‌సైట్, అధీకృత యాప్‌ ద్వారా అభ్యర్ధన పంపాల్సి ఉంటుంది. దీన్ని ఆమోదిస్తూ .. టెలికం సంస్థ ఒక ప్రత్యేక ఐడీ, ఓటీపీని మొబైల్‌ యూజర్‌కి పంపిస్తుంది. 
 
ఈ ఓటీపీ 10 నిమిషాల దాకా చెల్లుబాటు అవుతుంది. ఓటీపీని ధృవీకరిస్తే.. కనెక్షన్‌ మార్పునకు యూజరు సమ్మతించినట్లుగా టెలికం సంస్థ పరిగణిస్తుంది. 
 
ఏ తేదీ, సమయం నుంచి మార్పు అమల్లోకి వస్తుందనేది సమాచారం అందజేస్తుంది. ఇలా కనెక్షన్‌ మారే క్రమంలో సేవల అంతరాయం గరిష్టంగా 30 నిమిషాల కంటే ఎక్కువ అంతరాయం ఉండరాదంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం
Show comments