Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ ఐటీ నిపుణులకు బైడెన్ గుడ్ న్యూస్.. ఏంటదో తెలుసా?

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (23:14 IST)
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. డొనాల్ట్ ట్రంప్ విధానాలకు స్వస్తి చెప్పిన సంగతి తెలిసిందే. ఎన్నారైలకు సుముఖంగా వివాదాస్పద నిర్ణయాలకు దూరంగా వుంటూ.. తన పని తాను చేసుకుపోతున్న జో బైడెన్.. తాజాగా భారతీయ ఐటీ నిపుణులకు మరో తీపి కబురు అందించారు. మరింత మంది ఐటీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఇమ్మిగ్రేషన్ విధానానికి సమూల మార్పులు చేయ సంకల్పించారు. 
 
అమెరికాలో అన్ డాక్యుమెంటెడ్ జాబితాలో ఉన్న వలస కార్మికులు 1.1 కోట్ల మందికి శరవేగంగా పౌరసత్వం కల్పించేందుకు రూపొందించిన బిల్లును ప్రవేశపెట్టారు బైడెన్‌. అయితే ఈ ప్రతిపాదనకు బైడెన్‌కు రిపబ్లికన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసానికి వచ్చే విద్యార్థులకు అనుమతులు ఇవ్వాలని, ఉపాధి హామీ ఆధారిత గ్రీన్ కార్డుల సంఖ్యను పెంచాలని మరో నిబంధనను ప్రతిపాదించారు.
 
బైడెన్ ప్రభుత్వం చేసిన తాజా ప్రతిపాదనల వల్ల అమెరికాలోకి మరింత మంది విదేశీ నిపుణులు రావడానికి వెసులుబాటు కలుగుతుంది. దీనివల్ల అమెరికా కంపెనీల్లో అధిక నిపుణులైన కార్మికులకు హెచ్‌-1బీ వీసాలపై పరిమితులు ఉండవని బిజినెస్ గ్రూపులు భావిస్తున్నాయి. దీని ప్రకారం భవిష్యత్‌లో అత్యధిక నిపుణులకు ఉపాధి కల్పించేందుకు వీలు కలుగుతుందని అంచనా వేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

హరిహర వీరమల్లు లో అసరుల హననం సాంగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments