ఫ్రీ ఫైర్, పబ్‌జి గేమ్స్‌ను నిషేధించాలి.. ప్రధానికి న్యాయమూర్తి లేఖ

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (22:07 IST)
పిల్లలు ప్రస్తుతం ఆరు బయట ఆడుకోవడం లేదు. ఫోన్లు, కంప్యూటర్ల కాలం వచ్చేసింది. దీంతో ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నారు. ఇది వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఇక పబ్‌జి వంటి గేమ్స్ వల్ల పిల్లల్లో, యువతలో హింసా ప్రవృత్తి పెరిగిపోతోంది. అలాంటి గేమ్స్‌ను ఆడడం కోసం వారు ఏం చేసేందుకైనా వెనుకాడడం లేదు. ఈ క్రమంలోనే పబ్‌జి, ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్‌ను నిషేధించాలని కోరుతూ ఓ న్యాయమూర్తి తాజాగా ప్రధాని మోదీకి లేఖ రాశారు.
 
అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి నరేష్ కుమార్ లాకా తాజాగా ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఫ్రీ ఫైర్‌, పబ్‌జి మొబైల్ (బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా) లాంటి గేమ్‌లను బ్యాన్ చేయాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ గేమ్స్ వల్ల పిల్లలపై నెగెటివ్ ప్రభావం పడుతుందన్నారు. దీంతో వారి ఎదుగుదలపై ఆ గేమ్స్ ప్రభావం చూపిస్తున్నాయని అన్నారు. అందువల్ల గేమ్స్ ను బ్యాన్ చేయాలని కోరారు.
 
చైనాతోపాటు బంగ్లాదేశ్‌, నేపాల్ వంటి దేశాల్లో ఇప్పటికే అలాంటి గేమ్స్ ను బ్యాన్ చేశారని, కొన్ని చోట్ల పిల్లలు ఆ గేమ్స్ ను ఆడకుండా నిబంధనలను రూపొందించారని అన్నారు. అందువల్ల ఆ గేమ్స్‌ను బ్యాన్ చేసి పిల్లల ఆరోగ్యాన్ని రక్షించాలని నరేష్ కుమార్ లేఖలో మోదీని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments