Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రీ ఫైర్, పబ్‌జి గేమ్స్‌ను నిషేధించాలి.. ప్రధానికి న్యాయమూర్తి లేఖ

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (22:07 IST)
పిల్లలు ప్రస్తుతం ఆరు బయట ఆడుకోవడం లేదు. ఫోన్లు, కంప్యూటర్ల కాలం వచ్చేసింది. దీంతో ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నారు. ఇది వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఇక పబ్‌జి వంటి గేమ్స్ వల్ల పిల్లల్లో, యువతలో హింసా ప్రవృత్తి పెరిగిపోతోంది. అలాంటి గేమ్స్‌ను ఆడడం కోసం వారు ఏం చేసేందుకైనా వెనుకాడడం లేదు. ఈ క్రమంలోనే పబ్‌జి, ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్‌ను నిషేధించాలని కోరుతూ ఓ న్యాయమూర్తి తాజాగా ప్రధాని మోదీకి లేఖ రాశారు.
 
అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి నరేష్ కుమార్ లాకా తాజాగా ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఫ్రీ ఫైర్‌, పబ్‌జి మొబైల్ (బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా) లాంటి గేమ్‌లను బ్యాన్ చేయాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ గేమ్స్ వల్ల పిల్లలపై నెగెటివ్ ప్రభావం పడుతుందన్నారు. దీంతో వారి ఎదుగుదలపై ఆ గేమ్స్ ప్రభావం చూపిస్తున్నాయని అన్నారు. అందువల్ల గేమ్స్ ను బ్యాన్ చేయాలని కోరారు.
 
చైనాతోపాటు బంగ్లాదేశ్‌, నేపాల్ వంటి దేశాల్లో ఇప్పటికే అలాంటి గేమ్స్ ను బ్యాన్ చేశారని, కొన్ని చోట్ల పిల్లలు ఆ గేమ్స్ ను ఆడకుండా నిబంధనలను రూపొందించారని అన్నారు. అందువల్ల ఆ గేమ్స్‌ను బ్యాన్ చేసి పిల్లల ఆరోగ్యాన్ని రక్షించాలని నరేష్ కుమార్ లేఖలో మోదీని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments