Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ డిస్కౌంట్లతో ముందుకొస్తున్న యాపిల్... ఏప్రిల్ 5 నుంచి...

Webdunia
గురువారం, 4 ఏప్రియల్ 2019 (17:05 IST)
యాపిల్‌ ఫోన్‌ కొనాలనుకునే వారికి శుభవార్త. యాపిల్ కంపెనీ ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌ మోడల్‌పై భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది. ఈ మోడల్‌లోని అన్ని వేరియంట్ల ధరపై రూ. 17,000 తగ్గించింది. ఈ పరిమితకాల డిస్కౌంట్‌ ఆఫర్‌ ఏప్రిల్‌ 5 నుంచి అందుబాటులోకి రానుంది.
 
ప్రస్తుతం 64 జీబీ ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌ ధర రూ. 76,900, డిస్కౌంట్ పోను ఇది రూ. 59,900కే రానుంది. ఇక 128 జీబీ ఎక్స్‌ఆర్‌ ధర రూ. 81,900 కాగా రూ. 64,900కి లభించనుంది. ఐఫోన్‌ 256జీబీ ఎక్స్‌ఆర్‌ ధర రూ. 91,900 నుంచి రూ. 74,900లకు తగ్గనుంది. ఇవే కాకుండా హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డుతో కొనుగోలు చేసిన వారికి మరో 10శాతం అదనపు రాయితీ లభిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
 
అయితే ఇది కేవలం పరిమితకాల ప్రమోషనల్‌ ఆఫర్‌ మాత్రమేనని, శాశ్వత ధర తగ్గింపు కాదని కంపెనీ స్పష్టం చేసింది. ఈమధ్య కాలంలో భారత్‌లో ఐఫోన్‌ విక్రయాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ధర ఎక్కువగా ఉండటంతో పాటు షియోమీ వంటి కంపెనీల నుంచి పోటీ తీవ్రంగా ఉండటంతో ఐఫోన్‌ విక్రయాలు మందగించాయి. ఈ నేపథ్యంలో కంపెనీ ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ను తీసుకొచ్చిందని యాపిల్‌ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఒకరు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

Prabhas: నిర్మాత వదిలేసినా, ఇండస్ట్రీ వద్దన్నా మారుతీ తో ప్రభాస్ రాజాసాబ్ ఎందుకు చేశాడు

Rashmika: మా కెమిస్ట్రీ చూశాక మరిన్ని అవకాశాలు వస్తాయి : రష్మిక మందన్నా

Ye Maaya Chesave: ఏ మాయ చేసావే రీ-రిలీజ్: ప్రమోషన్ కోసం చైతూ- సమంత కలిసి కనిపిస్తారా?

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments