Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి రిలయన్స్ జియో ఉచిత ఫోన్‌కాల్స్..

Webdunia
శుక్రవారం, 1 జనవరి 2021 (09:31 IST)
దేశ ప్రైవేట్ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన ఖాతాదారులకు కొత్త సంవత్సర కానుకను ఇచ్చింది. ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జీని పూర్తిగా రద్దు చేసింది. నిజానికి ఈ విధానం శుక్రవారంతో ముగిసింది. దీంతో పాత విధానం ప్రకారం ఉచిత ఫోన్ కాల్స్ సదుపాయాన్ని కల్పించింది. 
 
రిలయన్స్ జియో సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉచిత ఫోన్ కాల్ సదుపాయాన్ని కల్పించింది. ఆ తర్వాత ఐయూసీ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో అనేక మంది ఖాతాదారులు పెదవి విరిచారు. పైపెచ్చు.. అనేక మంది ఇతర నెట్‌వర్క్‌లకు వెళ్లిపోయారు. 
 
ఈ క్రమంలో కొత్త సంవత్సరంలో మళ్లీ ఉచిత వాయిస్‌ కాల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై జియో కస్టమర్లు దేశీయంగా ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా కాల్స్‌ చేసుకోవచ్చని స్పష్టంచేసింది. ఇంటర్‌కనెక్ట్‌ యూసేజ్‌ చార్జి (ఐయూసీ) విధానం శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో ఈ సదుపాయాన్ని పునరుద్ధరిస్తున్నట్లు వివరించింది.
 
"ఐయూసీ విధానం రద్దయిన తర్వాత మళ్లీ ఉచిత కాల్స్‌ను పునరుద్ధరిస్తామని గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడే ఉన్నాం. 2021 జనవరి 1 నుంచి జియో వినియోగదారులు దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు" అని రిలయన్స్‌ జియో గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments