Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి రిలయన్స్ జియో ఉచిత ఫోన్‌కాల్స్..

Webdunia
శుక్రవారం, 1 జనవరి 2021 (09:31 IST)
దేశ ప్రైవేట్ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన ఖాతాదారులకు కొత్త సంవత్సర కానుకను ఇచ్చింది. ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జీని పూర్తిగా రద్దు చేసింది. నిజానికి ఈ విధానం శుక్రవారంతో ముగిసింది. దీంతో పాత విధానం ప్రకారం ఉచిత ఫోన్ కాల్స్ సదుపాయాన్ని కల్పించింది. 
 
రిలయన్స్ జియో సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉచిత ఫోన్ కాల్ సదుపాయాన్ని కల్పించింది. ఆ తర్వాత ఐయూసీ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో అనేక మంది ఖాతాదారులు పెదవి విరిచారు. పైపెచ్చు.. అనేక మంది ఇతర నెట్‌వర్క్‌లకు వెళ్లిపోయారు. 
 
ఈ క్రమంలో కొత్త సంవత్సరంలో మళ్లీ ఉచిత వాయిస్‌ కాల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై జియో కస్టమర్లు దేశీయంగా ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా కాల్స్‌ చేసుకోవచ్చని స్పష్టంచేసింది. ఇంటర్‌కనెక్ట్‌ యూసేజ్‌ చార్జి (ఐయూసీ) విధానం శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో ఈ సదుపాయాన్ని పునరుద్ధరిస్తున్నట్లు వివరించింది.
 
"ఐయూసీ విధానం రద్దయిన తర్వాత మళ్లీ ఉచిత కాల్స్‌ను పునరుద్ధరిస్తామని గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడే ఉన్నాం. 2021 జనవరి 1 నుంచి జియో వినియోగదారులు దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు" అని రిలయన్స్‌ జియో గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినీ బృందం (video)

Tabu: పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి చిత్రంలో టబు ఎంట్రీ

యాదార్థ సంఘటనల ఆధారంగా ప్రేమకు జై సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments