Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృత్రి మేధతో పోలిస్తే మానవ మేథస్సే అగ్రస్థానం : ఏఐ పితామహుడు హింటన్

Webdunia
బుధవారం, 3 మే 2023 (11:38 IST)
ప్రపంచానికి కృత్రి మేథ (ఏఐ) ప్రమాదకరమని, ప్రస్తుతానికి కృత్రిమ మేథతో పోలిస్తే మానవ మేథస్సే అగ్రస్థానంలో ఉందని ఏఐ పితామహుడు జాఫ్రీ హింటన్ అన్నారు. భవిష్యత్‌లో చాట్ బోట్స్ మానవ మేథను అధికమిస్తాయని, అపుడు పెను సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
కాగ్నిటివ్ సైకాలజిస్టు, గూగుల్ సాధారణ ఉద్యోగి నుంచి వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగి కృత్రిమ మేథ అభివృద్ధికి అహరహం కృషి చేసిన హింటన్ తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వచ్చిన రోబో, రోబో-2.0 చిత్రాల్లో రజనీకాంత్ రూపొందించిన రోబో సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదిగి, ఓ రోబో సామ్రాజ్యాన్ని స్థాపించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాలు తెల్సిందే. ఇప్పుడు అచ్చంగా అదేవిధంగా చాట్ బోట్లు 'అధికారం' కోసం ప్రయత్నిస్తే మానవాళికి ముప్పు తప్పదని హింటన్ ఆందోళన వ్యక్తం చేశారు. 
 
చాట్ బోట్లు కొత్త విషయాలను వేగంగా గుర్తిస్తాయని, వాటిని ఇట్టే నేర్చుకుంటాయని హింటన్ తెలిపారు. 'ఒక కంపెనీలో 10 వేల మంది పనిచేస్తే, వారిలో ఒక్కరు కొత్త విషయాన్ని నేర్చుకుంటే, దాన్ని మిగతా అందరికీ నేర్పించడం సాధ్యం కాదు. అదే 10 వేల చాబోబోట్లలో ఒక్కటి కొత్త విషయాన్ని నేర్చుకున్నా.. వెంటనే అన్నింటికీ ఆ అంశాన్ని నేర్పిస్తాయి' అని వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments