Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియోకు పోటీగా ఎయిర్‌టెల్ : క్వాల్‌కమ్‌తో కలిసి 5జీ సేవలు

Webdunia
మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (19:40 IST)
దేశంలో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టెలికాం సంస్థలు పోటీపడుతున్నాయి. ఇటీవలే జియో సంస్థ 5జీని తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. మరో టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ కూడా 5జీపై దృష్టి సారించింది.
 
భారత్‌లోకి 5జీ టెక్నాలజీని తీసుకొచ్చేందుకు అమెరికన్ టెక్ సంస్థ క్వాల్‌కమ్‌తో కలిసి పనిచేయనున్నట్లు ఎయిర్‌టెల్ తెలిపింది. దీని కోసం క్వాల్‌కమ్‌కు చెందిన రేడియో యాక్సెస్ నెట్‌వర్క్(ర్యాన్) ప్లాట్‌ఫాంలను వినియోగించనున్నట్లు ఎయిర్‌టెల్ వెల్లడించింది.
 
ఇదిలా ఉంటే భారత్‌లో తొలిసారి 5జీని పరీక్షించిన టెలికం సంస్థగా ఎయిర్‌టెల్ సంస్థ ఈ మధ్యనే రికార్డు సృష్టించింది. హైదరాబాద్‌లో ఓ లైవ్ అడ్వర్టైజ్‌మెంట్‌ను 5జీ ద్వారా ప్రసారం చేసి విజయం సాధించింది. ఈ విజయంతోనే క్వాల్‌కమ్ సాయంతో 5జీ బ్రాడ్‌బ్యాండ్ సేవలను కూడా ప్రారంభించాలని ఎయిర్‌టెల్ భావిస్తోంది. 
 
దీనికోసం 5జీ ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (ఎఫ్‌డబ్ల్యూఏ) ద్వారా గిగాబైట్ స్పీడ్‌లో ఇంటర్నెట్ స్పీడ్‌ను అందించేందుకూ ప్రణాళికలు రచిస్తోంది. దీనిని బట్టి 4జీ సేవల్లో భారీ వినియోగదారులను సొంతం చేసుకున్న జియోకు ఎయిర్ టెల్ గట్టి పోటీ ఇవ్వనుందని.. 5జీ సేవలను కస్టమర్లకు అందించేందుకు ఎయిర్ టెల్ పక్కా ప్లాన్ వేస్తుందని ఐటీ నిపుణులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments