ఎయిర్‌టెల్ రూ.98 డేటా ప్యాక్‌తో డబుల్ డేటా

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (19:52 IST)
ప్రముఖ ప్రైవేట్ రంగ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ రోజురోజుకూ సరికొత్త ఆఫర్‌లతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. సాధారణంగా ఈ సంస్థ అందిస్తున్న రూ.98 డేటా యాడ్ ఆన్ ప్యాక్‌పై ఇప్పుడు డబుల్ డేటాను అందిస్తోంది. అంటే, ప్రస్తుతం రూ.98కి ఇస్తున్న 6జీబీ హైస్పీడ్ డేటాతో పాటు మరో 6జీబీ హైస్పీడ్ డేటాను వినియోగదారులు బ్రౌజ్ చేసుకోవచ్చు. 
 
గతంతో పోలిస్తే, డేటాను రెండు రెట్లు పెంచడంతో వినియోగదారులకు మరింత డేటా బ్రౌజ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇప్పటికే టెలికాం రంగంలో సంచలనాలకు దారితీసిన జియో కూడా ఇదే తరహాలో తమ వినియోగదారులకు డేటా ప్రయోజనాలను అందిస్తోంది. వొడాఫోన్ సంస్థ కూడా నెలవారీ రీఛార్జ్ చేసుకునే వారికి రోజువారీ అందించే 1.5 జీబీతో పాటు మరో 1.5జీబీ డేటాను అదనంగా అందిస్తోంది. 
 
అలాగే జియో సైతం రూ. 101 రీఛార్జ్ ప్లాన్‌లో భాగంగా వినియోగదారులకు యాడ్-ఆన్ ప్యాక్‌తో 12జీబీ హైస్పీడ్ డేటాతో పాటుగా 1000 నిమిషాల నాన్-జియో వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను అందిస్తోంది. ప్రస్తుతం ఎయిర్‌టెల్ ఈ ఆఫర్‌ను ప్రకటించడం వల్ల లాక్‌డౌన్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వేలాది మందికి ఈ డేటాను ఉపయోగించుకునే అవకాశం లభించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కుమార్తెలో లెజెండరీ నటి ఆత్మ ప్రవేశించిందేమో? రవీనా టాండన్

దిగ్గజ దర్శకుడు శాంతారామ్ సతీమణి సంధ్య ఇకలేరు

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments