Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టిన ఎయిర్‌టెల్

Webdunia
మంగళవారం, 16 ఆగస్టు 2022 (14:56 IST)
ప్రైవేట్ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ మరో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత స్వాతంత్ర్య వేడుకలను పురస్కరించుకుని రిలయన్స్ జియో పలు కొత్త ప్లాన్లతో ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. అయితే, జియోకు ప్రధాన పోటీదారుడుగా ఉన్న ఎయిర్‌టెల్ ఒక రోజు ఆలస్యంగా ఈ కొత్త ప్లాన్లను తెచ్చింది. 
 
ఇందులో రూ.519, రూ.779 ప్లాన్లు ఉన్నాయి. ముఖ్యంగా, రూ.519 ప్లానులో 60 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 1.5జీబీ డేటా చొప్పున 90 జీబీ డేటాను వాడుకోవచ్చు. అలాగే, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. వీటితో పాటు పలు ఉచిత ప్రయోజనాలు కూడా పొందవచ్చు. 
 
అదేవిధంగా రూ.779 ప్లాన్‌లో 90 రోజుల వ్యాలిడిటీతో పాటు 1.5 జీబీ డేటాతో మొత్తం 135 జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు. రోజుకూ 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా పంపుకునే వెసులుబాటు వుంది. కాగా, ఈ కంపెనీ ఇప్పటికే రూ.299, రూ.479, రూ.299 ప్లాన్లతో 28 రోజుల వ్యాలిడిటీతో ఉచిత కాలింగ్, ఎస్ఎంఎస్ సదుపాయాలు లభిస్తాయి. రూ.479 ప్లాన్ వ్యాలిడిటీ రూ.56 రోజులుగా ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

ప్రముఖ నటి రజిత కి మాతృవియోగం

అగ్రనటులతో టీవీ షోలో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారా?

హరిహర వీరమల్లు విడుదలకు సిధ్ధమవుతోంది - డబ్బింగ్ షురూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments