Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌టెల్ నుంచి చౌకగా నాలుగు కొత్త ప్లాన్లు

Webdunia
గురువారం, 7 జులై 2022 (17:03 IST)
దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ టెలికాం సంస్థగా ఉన్న ఎయిర్‌టెల్ తాజాగా నాలుగు కొత్త ప్లాన్లను తీసుకొచ్చింది. అదీ కూడా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా చౌకకా ప్రవేశపెట్టింది.
 
తక్కువగా వినియోగించే చిన్న కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఈ నాలుగు ప్లాన్లను తీసుకొచ్చింది. ఇందులో రూ.109, రూ.111, రూ.128, రూ.131 ఉన్నాయి. 
 
రూ.109 ప్లాన్...
ఈ కాల పరిమితి 30 రోజులు. ఇందులో 200 ఎంబీ డేటా లభిస్తుంది. అలాగే, రూ.99 టాక్ టైమ్ కూడా వర్తిస్తుంది. నెల రోజుల పాటు ఈ డేటా, టాక్ టైమ్ అందుబాటులో ఉంటాయి. లోకల్, ఎస్టీడీ, ల్యాండ్‌లైన్‌కు చేరుకునేలా వాయిస్ కాల్స్‌కు చేసే ప్రతి సెకన్‌కు 2.5 పైసలు చొప్పున చార్జ్ చేస్తారు. ప్రతి లోకల్ ఎస్ఎంఎస్‌కు ఒక్క రూపాయి, నేషనల్ ఎస్ఎంఎస్‌కు రూ.1.44 చొప్పున వసూలు చేస్తారు. 
 
రూ.111 ప్లాన్... 
ఇది కూడా రూ.109 ప్లాన్ తరహాలోనే ఉంటుంది. కాకపోతే, ఇందులో రూ.109 ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు కాగా, రూ.111 ప్లాన్ నెల వ్యాలిడిటీతో వస్తుంది. అయితే, ప్రతి నెలా ఒకే తేదీన రీచార్జ్ చేసుకుంటే సరిపోతుంది. 
 
రూ.128 ప్లాన్...
ఈ ప్లాన్ 30 రోజుల కాలపరిమితి. ఇందులో ప్రతి సెకనుకు 2.5 పైసలు చొప్పున కాల్ చార్జీ వసూలు చేస్తారు. ప్రతి వీడియో కాల్‌ సెకనుకు రూ.5 పైసలు చొప్పున వసూలు చేస్తారు. మొబైల్ డేటా ఒక ఎంబీకి 50 పైసలు చార్జ్ చేస్తారు. లోకల్‌ ఎస్ఎంఎస్‌కు ఒక్క రూపాయి, నేషనల్ ఎస్ఎంఎస్‌కు రూ.1.50 చొప్పున వసూలు చేస్తారు. 
 
రూ.131 ప్లాన్... 
ఈ ప్లాన్ గడువు నెల రోజులు. అంటే ప్రతి నెల ఒకటో తేదీన రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మిగిలిన చార్జీలన్నీ కూడా రూ.128 ప్లాన్ తరహాలోనే ఉంటాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments