Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్... కొత్త కస్టమర్లకే...

Webdunia
శుక్రవారం, 4 జనవరి 2019 (14:06 IST)
దేశంలోని ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో ఒకటైన ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కేవలం కొత్త కస్టమర్లకు మాత్రమే వర్తించనుంది. దేశీయ టెలికాం రంగంలోకి రిలయన్స్ జియే సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత టెలికాం కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. దీంతో టెలికాం ధరలు కూడా కిందికి దిగివచ్చాయి.
 
అదేసమయంలో టెలికాం కంపెనీల మధ్య ఏర్పడిన పోటీ కారణంగా వివిధ రకాల ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునేపనిలో నిమగ్నమయ్యాయి. ఇందులోభాగంగా, ఇపుడు ఎయిర్‌టెల్ కంపెనీ తన కొత్త కస్టమర్ల కోసం రూ.76 రీఛార్జ్‌తో కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ తీసుకున్న కొత్త కస్టమర్లకు రూ.26 టాక్ టైమ్ కూడా పొందవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్ కాలపరిమితి 28 రోజులుగా నిర్ణయించింది. ఇది కేవలం కొత్త కస్టమర్లకు మాత్రమే వర్తించనుంది. 
 
ఎయిర్ టెల్ కొత్త కస్టమర్లు ముందుగా రూ.76 ఫస్ట్ టైం రీఛార్జ్ (ఫస్ట్ రీఛార్జ్) చేయించుకోవాల్సి ఉంటుంది. గత ఏడాదిలో ఎఫ్ఆర్సీ రీఛార్స్‌లపై వరుసగా రూ.178, రూ.229, రూ.344, రూ.495, రూ.599 ప్యాకులను అందిస్తోన్న ఎయిర్ టెల్ జాబితాలో రూ.76 రీఛార్జ్ వచ్చి చేరింది. ఈ ఎఫ్ఆర్సీ పోర్ట్ పోలియో నుంచి కొత్త కస్టమర్లు 126 జీబీ డేటా బెనిఫెట్స్ పొందవచ్చు. వాయిస్ కాల్స్ ప్రతి నిమిషానికి 60 పైసలు చొప్పున ఛార్జ్ అవుతుంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments