ఎయిర్‌టెల్ వినియోగదారులకు శుభవార్త.. ఎయిర్‌టెల్ బ్లాక్ లాంఛ్

Webdunia
శుక్రవారం, 2 జులై 2021 (22:09 IST)
ఎయిర్‌టెల్ వినియోగదారులకు శుభవార్త. పోస్ట్‌పెయిడ్, డైరెక్ట్ టు హోం (డీటీహెచ్), ఫైబర్ సర్వీసులను ఎయిర్‌టెల్ ఒకే గొడుకు కిందికి తీసుకొచ్చింది. అంటే ఇకపై ఇవన్నీ ఒకే బిల్లుపై లభిస్తాయన్నమాట. ఎయిర్ టెల్ తాజాగా 'ఎయిర్‌టెల్ బ్లాక్'ను లాంచ్ చేసింది. ఇందులో పలు ప్లాన్లు ఉన్నాయి. ఇవి నచ్చని వారు సొంతంగా తామే ఓ ప్లాన్‌ను రూపొందించుకోవచ్చు. ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్లు రూ. 998 నుంచి మొదలవుతాయి. 
 
ఎయిర్‌టెల్ బ్లాక్ నేటి నుంచే వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఇందులో ఒక డీటీహెచ్ కనెక్షన్, రెండు పోస్టుపెయిడ్ మొబైల్ కనెక్షన్లు నెలకు రూ. 998తో లభిస్తాయి. మూడు మొబైల్ కనెక్షన్లు, ఒక డీటీహెచ్ కనెక్షన్ రూ. 1,349తో అందుబాటులో ఉంది. 
 
అలాగే, ఒక ఫైబర్ కనెక్షన్, రెండు పోస్టు పెయిడ్ మొబైల్ కనెక్షన్లను రూ. 1,598 ప్యాక్‌తో లభిస్తాయి. ఇందులో టాప్ ఎండ్ ప్లాన్ విలువ రూ. 2,099. ఇందులో మూడు మొబైల్ కనెక్షన్లు, ఒక ఫైబర్, ఒక డీటీహెచ్ కనెక్షన్ నెల రోజుల కాలపరిమితితో అందుబాటులో ఉంది.
 
ఈ ఫిక్స్‌డ్ ప్లాన్లు అనువుగా లేవనుకుంటే ఎవరికి వారే రెండు అంతకంటే ఎక్కువ సేవలతో ఓ సొంత ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్‌ను రూపొందించుకోవచ్చు. అయితే, ఇది ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ఖాతాదారులకు వర్తించదు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments