Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంపర్ ఆఫర్‌ ప్రకటించిన ఎయిర్‌టెల్... జియోకు ధీటుగా

దేశ టెలికాం రంగంలో ధరల యుద్ధం కొనసాగుతోంది. రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు వీలుగా మిగిలిన ప్రైవేట్ కంపెనీలు కూడా భారీ ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. తాజాగా టెలికాం దిగ

Webdunia
శనివారం, 4 మార్చి 2017 (18:23 IST)
దేశ టెలికాం రంగంలో ధరల యుద్ధం కొనసాగుతోంది. రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు వీలుగా మిగిలిన ప్రైవేట్ కంపెనీలు కూడా భారీ ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. తాజాగా టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ ఓ భారీ ఆఫర్‌ను ప్రకటించింది. 
 
ఈ ఆఫర్ మేరకు... కేవలం రూ.345 రిచార్జ్‌తో రోజుకు 1 జీబీ డాటా చొప్పున 28 రోజులపాటు 28 జిబి డాటా, అపరిమిత లోకల్, నేషనల్ ఫోన్‌కాల్స్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అయితే 1 జిబి డాటాను పగలు 500 ఎంబీలు, రాత్రి సమయంలో 500 ఎంబీల చొప్పున వినియోగించుకునే పరిమితిని విధించింది. 
 
ఈ ఆఫర్‌ను పొందాలంటే 4జి మొబైల్ కలిగిన యూజర్లు మార్చి 31 లోపు రూ.345తో రిచార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. మార్చి 31 లోపు చేయించుకున్న వారు తదుపరి 11 నెలలు ఇదే తరహా ఆఫర్‌ను పొందవచ్చు. జియో ప్రైమ్ ఆఫర్‌‌కు ఛాలెంజ్ విసురుతూ ఈ సరికొత్త ఆఫర్‌ను ఎయిర్ టెల్ ప్రకటించడం గమనార్హం. 
 
అలాగే, రూ.549తో రిచార్జ్ చేసుకునే కస్టమర్లు మాత్రం రోజుకు 1 జీపీ డాటాను ఎలాంటి ఆంక్షలు లేకుండా వినియోగించుకోవచ్చు. ఇది కూడా 28 రోజుల కాలపరిమితి కలిగివుంటుంది. అన్‌లిమిటెడ్ ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments