అబుదాబిలో జియో జెండా.. ముబాదలాకు రూ.9003 కోట్ల షేర్లు

Webdunia
శనివారం, 6 జూన్ 2020 (13:59 IST)
రిలయన్స్ జియో సంస్థ అబుదాబిలో వ్యాపారాన్ని విస్తరించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తాజాగా అబుదాబికి చెందిన ముబాదలా సంస్థ జియోకు చెందిన వాటాలను కొనుగోలు చేసింది. ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జియో.. భారీ సంఖ్యలో వినియోగదారులను కలిగివుంది. ఈ సంస్థకు చెందిన కొన్ని వాటాలను అంటే జియోకు చెందిన 9.99% వాటాలు, 5.7 బిలియన్ డాలర్లకు ఫేస్‌బుక్ సంస్థ కొనుగోలు చేసింది. 
 
భారత్ కరెన్సీ విలువ ప్రకారం రూ.43,574 కోట్లు. ఆపై అమెరికాకు చెందిన సిల్వర్ లేక్ సంస్థ రిలయన్స్ జియోకు చెందిన ఒక శాతం షేర్లను కొనుగోలు చేసింది. దీని విలువ రూ.5,655.75 కోట్లు. ఈ ఒప్పందానికి తర్నాత రిలయన్స్ జియో తన 2.3 శాతం షేర్లను అమెరికా టెక్నాలజీ సంస్థ అయిన విస్టాకు విక్రయించింది. దీని విలువ రూ.11,367 కోట్లు. తద్వారా జియో సంస్థ రూ.60596.37 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 
 
ప్రస్తుతం అబుదాబికి చెందిన ప్రముఖ సంస్థ ముబాదాలా కూడా జియో వాటాలను కొనుగోలు చేసింది. జియోకు చెందిన 1.85శాతానికి చెందిన వాటాలను రూ.9003 కోట్లకు కొనుగోలు చేసింది. తద్వారా జియోకు చెందిన 18.97 శాతానికి చెందిన షేర్లను ఆరు అతిపెద్ద కంపెనీలు కొనుగోలు చేయడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

akhanda 2 Update: అఖండ 2 విడుదల కాకపోవటంతో ఎగ్జిబిటర్స్ చాలా నష్టపోయారు : నట్టికుమార్

Shah Rukh Khan: లండన్ లీసెస్ట‌ర్ స్క్వేర్‌లో షారూఖ్ ఖాన్‌, కాజోల్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments