Webdunia - Bharat's app for daily news and videos

Install App

అకౌంట్లు, సిమ్‌లకు ఆధార్ అవసరమా..?

Webdunia
శనివారం, 23 నవంబరు 2019 (12:55 IST)
న్యూఢిల్లీ: ప్రైవేటు సంస్థలు ఆధార్​ డేటాను వాడుకునేందుకు అనుమతిస్తూ కేంద్ర సర్కార్​ ‘ఆధార్​ చట్టం’లో చేసిన మార్పులు రాజ్యాంగవిరుద్ధమంటూ దాఖలైన పిటిషన్​ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది.

ప్రస్తుతం దేశంలోని దాదాపు అన్ని బ్యాంకులు, టెలికాం సంస్థలు ఆధార్​ డేటాను తీసుకున్న తర్వాతే సేవలందిస్తున్నాయి. కస్టమర్లకు ఇష్టమైతే స్వచ్ఛందంగా డేటా ఇవ్వొచ్చంటూ కేంద్రం జులైలో ఆధార్ చట్టానికి సవరణ చేయడంతో  ప్రైవేటు సంస్థలు ఆధార్​ డేటాను వాడుకుంటున్నాయి.
 
అయితే, జులైలో కేంద్రం చేసిన సవరణ.. 2019 మార్చి నాటి సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్​ తీర్పును నీరుగార్చేలా ఉందని, ప్రైవేటుకు ఆధార్​ అనుమతి రాజ్యాంగవిరుద్ధమంటూ ఎస్​జీ వొంబాట్కేర్​ అనే రిటైర్డ్​ ఆర్మీ అధికారి సుప్రీంకోర్టులో పిటిషన్​ వేశారు. దీన్ని సీజేఐ జస్టిస్​ ఎస్​ఏ బోబ్​డే, జస్టిస్​ బీఆర్ గవై బెంచ్​ పరిశీలించింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాల్సిందిగా బెంచ్​  కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 
 
ఆధార్​ చట్టం ప్రమాణికతను సమర్థిస్తూ మార్చిలో తీర్పు చెప్పిన సుప్రీం బెంచ్​.. ఈ చట్టానికి ఎలాంటి మినహాయింపులు ఉండవని, స్వచ్ఛందంగానైనాసరే కస్టమర్ల నుంచి ప్రైవేటు కంపెనీలు ఆధార్​ డేటా సేకరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి భార‌తి ఈజ్ బ్యాక్‌! చ‌దువు రాని ఓ గృహిణి నుంచి రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా.. (video)

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

ఛావా తెలుగు ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చింది

అనంతిక సనీల్‌కుమార్‌ 8 వసంతాలు లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments