Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఈ ఏడాది చివరికల్లా 5జీ సేవలు.. మొత్తం 16 దరఖాస్తులు

Webdunia
మంగళవారం, 4 మే 2021 (18:31 IST)
దేశంలో ఈ ఏడాది చివరికల్లా 5జీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో ట్రయల్స్ నిర్వహించేందుకు 13 కంపెనీల దరఖాస్తులను ప్రభుత్వం ఆమోదించింది. చైనా కంపెనీలైన హువావే, జెడ్‌టీఈలను 5 జీ ట్రయల్‌కు దూరంగా ఉంచారు. 5 జి ట్రయల్స్ కోసం టెలికం విభాగానికి మొత్తం 16 దరఖాస్తులు వచ్చాయి.
 
5 జీ ట్రయల్ కోసం ప్రభుత్వ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీ-డాట్) తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 
 
టెలిమాటిక్స్ అభివృద్ధి కేంద్రంను 1984లో స్థాపించారు. భారతి ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా, రిలయన్స్ జియో సంస్థలు ఎరిక్సన్, నోకియాకు చెందిన విక్రేతలతో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి.
 
5 జీ ట్రయల్ కోసం టెలికాం కంపెనీలకు త్వరలో 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్ ఎయిర్ వేవ్స్ ఇవ్వనున్నట్లు టెలికం విభాగం ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇకపోతే.. 5జీ సేవలను మొదట దక్షిణ కొరియా, చైనా, యునైటెడ్ స్టేట్స్ లో ప్రవేశపెట్టారు.
 
5జీ ట్రయల్స్‌ ప్రారంభించేందుకు భారత్ సన్నాహాలు చేస్తున్నప్పటికీ.. ఈ రకం సేవలు ఇప్పటికే 68 దేశాల్లో ప్రారంభమయ్యాయి. ఇందులో శ్రీలంక, ఒమన్, ఫిలిప్పీన్స్, న్యూజిలాండ్ వంటి అనేక చిన్న దేశాలు కూడా ఉండటం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments