Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా దెబ్బకు 75 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు, లాక్ డౌన్ విధిస్తే...?

Webdunia
మంగళవారం, 4 మే 2021 (17:49 IST)
కోవిడ్ -19 మహమ్మారి సెకెండ్ వేవ్‌లో స్థానికంగా విధిస్తున్న లాక్‌డౌన్‌, ఇత‌ర ఆంక్ష‌ల కారణంగా దేశంలో 75 ల‌క్ష‌ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎంఐఈ) ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది. సిఎమ్ఐఈ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహేష్ వ్యాస్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఉద్యోగ క‌ల్ప‌న సవాలుగా మార‌నున్న‌ద‌ని భావిస్తున్నాన‌న్నారు. మార్చితో పోల్చితే ఏప్రిల్ నెలలో 75 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయార‌ని తెలిపారు. ఫ‌లితంగా నిరుద్యోగ రేటు పెరిగింది
 
కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం జాతీయ నిరుద్యోగిత రేటు 7.97 శాతానికి చేరుకుంది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు 9.13 శాతం ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇది 7.13 శాతంగా ఉంది. అంతకుముందు మార్చిలో జాతీయ నిరుద్యోగిత రేటు 6.50 శాతంగా ఉంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ రేటు చాలా తక్కువగా ఉంది.

కోవిడ్ -19 మహమ్మారి విజృంభ‌ణ కార‌ణంగా అనేక రాష్ట్రాల‌లో లాక్‌డౌన్‌తో సహా ప‌లు ఆంక్షలను విధించారు. ఇది ఆర్థిక కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది. కోవిడ్-19 మహమ్మారి ఎప్పుడు గరిష్ట స్థాయికి చేరుకుంటుందో తెలియడం లేద‌ని, అయితే దీని కార‌ణంగా ఉపాధిపై ఒత్తిడి ఏర్ప‌డ‌ట‌మ‌నేది ఖచ్చితంగా చూడవచ్చని వ్యాస్ అన్నారు. అయితే, ప్రస్తుత లాక్‌డౌన్‌లో... గ‌తంలో త‌లెత్తినంత దారుణ ప‌రిస్థితులు లేవ‌ని ఆయన అన్నారు. గ‌తంలో నిరుద్యోగిత రేటు 24 శాతానికి చేరుకుంద‌న్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments