Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లిఫ్‌కార్ట్‌లో దొంగలు పడ్డారు.. 150 ఖరీదైన స్మార్ట్‌ఫోన్లను ఇలా కొట్టేశారు..

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (11:03 IST)
ఈ-కామర్స్ సంస్థ ఫ్లిఫ్‌కార్ట్‌లో దొంగలు పడ్డారు. ఆన్‌లైన్ వాణిజ్యంలో పేరెన్నికగన్న ఫ్లిఫ్‌కార్ట్‌ సంస్థ వినియోగదారుల కోసం ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్లిఫ్‌కార్ట్‌‌లో మొబైళ్లు చోరీకి గురయ్యాయి. ఢిల్లీ శివారులోని అలీపూర్ హబ్‌లో 150 ఖరీదైన స్మార్ట్ ఫోన్లను దొంగలించారు. దీంతో ఫ్లిఫ్‌కార్ట్‌ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ నెల 19న అలీపూర్ హబ్ నుంచ్ బిలాస్‌పూర్‌లోని గోదాముకు తరలించేటప్పుడు ఈ ఫోన్లను కొట్టేశారని నిర్ధారించారు. ఈ చోరీలో ప్రమేయమున్న ముఠాకు చెందిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
నిందితుల నుంచి 30 స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. అదుపులో తీసుకున్న వారిలో సంతోష్‌తో పాటు బ్రీజ్‌మోహన్‌, అఖిలేశ్‌, రంజిత్‌ అనే నలుగురు వున్నారు. వీరంతా పలు ట్రాన్స్ పోర్ట్ కంపెనీల్లో డ్రైవర్లుగా పనిచేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments