Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంజెక్షన్ వికటించి బాలుడు శరీరం నుంచి వేడిసెగలు.. మృతి

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (07:32 IST)
జ్వరానికి వేసిన ఇంజెక్షన్ వికటించింది. ఫలితంగా బాలుడు శరీరం నుంచి వేడి సెగలు వచ్చాయి. అంతేనా ఆ బాలుడు మెలికలు తిరిగిపోతూ తనువు చాలించాడు. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని కాపుగల్లు అనే గ్రామంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కాపుగల్లు గ్రామానికి చెందిన బాడిశ నర్సింహారావు అనే వ్యక్తి కుమారుడు కార్తీక్(5)కు గత నెల రోజుల క్రితం డెంగ్యూ జ్వరం వచ్చి తగ్గిపోయింది. బుధవారం నర్సింహారావు ఓ ఫంక్షన్ వెళ్లవలసి ఉంది. 
 
ఈ క్రమంలో కార్తీక్‌కు మళ్లీ జ్వరం వచ్చింది. దీంతో ఇంటికి సమీపంలో ఉన్న ఓ వైద్యుడి వద్దకు తీసుకెళ్ళి ఇంజెక్షన్ వేయించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి బాలుడు శరీరం నుంచి వేడిసెగలు రావడంతోపాటు మెలికలు తిరుగుతుండటంతో తల్లిదండ్రులు బాలుడిని గ్రామంలోని మదో వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. 
 
బాలుడి తీరు పరిశీలించి వెంటనే కోదాడ పెద్ద దవాఖానకు తరలించాలని సలహా ఇవ్వడంతో ద్విచక్రవాహనంపై తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. బాలుడికి రెండు రోజులుగా జలుబు, జ్వరం ఉండడంతో అదే ఇంజక్షన్‌ను ఫ్రిజ్‌లో పెట్టి స్థానిక వైద్యుడితో ఇప్పిస్తున్నారు. బుధవారం అనుకోకుండా ఈ ఘటన చోటుచేసుకోవడంతో తల్లిదండ్రులు షాక్‌కు గురై కన్నీటి పర్యంతమయ్యారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments