Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో 348 యాప్స్‌పై నిషేధం.. మంత్రి చంద్రశేఖర్

Webdunia
శుక్రవారం, 5 ఆగస్టు 2022 (14:54 IST)
భారత్‌లో యాప్స్ బ్యాన్ గురించి కేంద్రం తాజాగా అధికారిక ప్రకటన చేసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ విషయంపై కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమాచారం వెల్లడించారు.
 
దేశంలో ఇప్పటి వరకు 348 యాప్స్‌పై నిషేధం విధించినట్టు మంత్రి చంద్రశేఖర్ ప్రకటించారు. భారత యూజర్ల సమాచారాన్ని ఈ యాప్స్ సేకరించి.. వేరే దేశాల్లో ఉన్న సర్వర్‌లకు చేరవేస్తున్నట్టు గుర్తించామని, అందుకే బ్యాన్ చేసినట్టు వెల్లడించారు. 
 
విదేశాల్లోని సర్వర్స్‌కు యూజర్ల డేటాను పంపుతున్న 348 యాప్స్‌ను గుర్తించి, బ్యాన్ విధించామని ప్రకటించారు. ఇలా విదేశాలకు డేటా చేరితే భారత సమగ్రతకు, భద్రతకు ముప్పు వాటిల్లుతుందని అందుకే బ్యాన్ చేసినట్టు స్పష్టం చేశారు.
 
తాజాగా బ్యాటిల్ రొయాల్ గేమ్‌ బ్యాటిల్‌ గ్రౌండ్స్ మొబైల్‌ ఇండియా (BGMI)పై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ ఈ గేమ్‌ను తొలగించాయి. ఐటీ యాక్ట్ 2020 కిందే BGMIను కూడా నిషేధించింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments