Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ అభిమానులకు చేదువార్త.. చెన్నై కెప్టెన్సీకి ధోని గుడ్‌బై!

Webdunia
గురువారం, 24 మార్చి 2022 (15:22 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూల్ కెప్టెన్‌గా పేరున్న ధోనీ అభిమానులకు చేదువార్తే చెప్పారని అనుకోక తప్పదు. అంతర్జాతీయ క్రికెట్‌లో లేకపోయినా ధోనీ ఐపీఎల్‌లో వుంటే చాలునని, ఐపీఎల్ చెన్నై జట్టుకు కెప్టెన్‌గా వుంటే చాలునని ఆయన ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కానీ ఆ ఫ్యాన్సుకు షాకిచ్చే నిర్ణయాన్ని ధోనీ తీసుకున్నారు. 
 
అదేంటంటే ఐపీఎల్ 2022 సీజన్ ముంగిట చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహేంద్రసింగ్ ధోనీ తప్పుకున్నాడు. మార్చి 26 నుంచి ఐపీఎల్ 2022 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్న నేపథ్యంలో ధోనీ నిర్ణయం ఫ్యాన్సుకు షాకిచ్చింది. 
 
ఇకపోతే.. ఐపీఎల్ కానుండగా.. తొలి మ్యాచ్‌లోనే కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొట్టబోతోంది. కానీ.. తొలి మ్యాచ్‌ ముంగిట కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకోగా.. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చేతికి టీమ్ పగ్గాలిస్తున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ ప్రకటించింది. 
 
ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్న ధోనీ.. ఆ జట్టుని ఇప్పటికే నాలుగు సార్లు టైటిల్ విజేతగా నిలిపాడు. ఇంకేముంది.. కెప్టెన్సీ నుంచి వైదొలగినా.. చెన్నై ఆటగాడిగా ధోనీ దంచేస్తాడంటూ ఆయన ఫ్యాన్స్ అనుకుంటున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మృగశిర కార్తె: కస్టమర్లతో నిండిపోయిన చేపల మార్కెట్లు.. భారీగా పలికిన ధరలు

కాకాణి గోవర్థన్ రెడ్డిపై మరో కేసు... ఇక జైలుకే పరిమితమా?

పిఠాపురం నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన సిట్టింగ్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్

ముంబైలో ఘోరం.. రైలు నుంచి జారిపడి 12 మంది మృతి

Kavati Manohar: గుంటూరు నగర మాజీ మేయర్ కావటి సస్పెండ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

NBK 111: గోపీచంద్ మలినేని తో గర్జించే సింహంగా ఎన్.బి.కె.111 చిత్రం ప్రకటన

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

తర్వాతి కథనం
Show comments