Webdunia - Bharat's app for daily news and videos

Install App

18న చెన్నైలో ఐపీఎల్ వేలం : మాజీ పేసర్ శ్రీశాంత్ ఆశలు ఆవిరి

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (14:48 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోకి రావాలనే టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ ఆశలు నెరవేరలేదు. అతనిపై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. దీంతో 292 మందితో ప్రకటించిన తుది జాబితాలో శ్రీశాంత్‌కు చోటు దక్కలేదు. ఈ నెల 18న చెన్నైలో ఐపీఎల్ వేలం జరగనున్న సంగతి తెలిసిందే. 
 
2013 ఐపీఎల్ ఎడిషన్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి ఏడేళ్ల నిషేధం ఎదుర్కొన్న శ్రీశాంత్‌.. ఈ మధ్యే మళ్లీ కాంపిటీటివ్ క్రికెట్‌లోకి వచ్చాడు. కేరళ తరపున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడాడు. ఐదు మ్యాచ్‌ల్లో 18 ఓవర్లు వేసి 4 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు.
 
మరోవైపు శ్రీశాంత్‌ను వద్దనుకున్న ఫ్రాంచైజీలు.. టెస్ట్ స్పెషలిస్ట్ చెటేశ్వర్ పుజారాపై మాత్రం ఆసక్తి చూపించాయి. దీంతో అతనికి 292 మంది లిస్ట్‌లో చోటు దక్కింది. పుజారా కనీస ధర రూ.50 లక్షలుగా నిర్ణయించారు. 
 
అటు సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కూడా రూ.20 లక్షల కనీస ధరతో ఆల్‌రౌండర్ల లిస్ట్‌లో స్థానం సంపాదించాడు. అటు వేలం కోసం రిజిస్టర్ చేసుకున్న 42 ఏళ్ల ప్లేయర్ నయన్ దోషి కూడా రూ.20 లక్షల బేస్ ప్రైస్‌తో క్వాలిఫై కావడం విశేషం. ఇతడు టీమిండియా మాజీ క్రికెటర్ దిలీప్ దోషి తనయుడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

Telangana: తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

తర్వాతి కథనం
Show comments