Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యాక్స్‌వెల్‌కు డిమాండ్ తగ్గలేదుగా.. వామ్మో వేలంలో రూ.14.25 కోట్లు పలికాడు..

Webdunia
గురువారం, 18 ఫిబ్రవరి 2021 (15:44 IST)
Glenn Maxwell
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు ఐపీఎల్‌లో ఏమాత్రం డిమాండ్ తగ్గలేదు. గత సీజన్‌లో అతనికి పది కోట్లు ఇచ్చినా పంజాబ్ తరఫున దారుణంగా విఫలమయ్యాడు. టోర్నీ మొత్తంలో కనీసం ఒక్క సిక్స్ కూడా బాదలేదు. దీంతో ఆ టీమ్ అతన్ని వదిలేసింది. 
 
కానీ ఈసారి రూ.2 కోట్ల బేస్‌ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన మ్యాక్స్‌వెల్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. అతని కోసం బెంగళూరు, చెన్నై ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి బెంగళూరే అతన్ని రూ.14.25 కోట్లకు కొనుగోలు చేసింది.
 
ఇకపోతే.. ఐపీఎల్ సీజన్ 14 మినీ వేలానికి మినీ వేలం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ గురువారం ఆటగాళ్ల జాబితాను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సారి ఐపీఎల్ కు మొత్తంగా 1,114 మంది ప్లేయర్లు పేరు రిజిస్టర్ చేసుకోగా.. ఫ్రాంచైజీల విజ్ఞాప్తి మేరకు 292 మంది ఆటగాళ్లను ఫైనల్ చేసింది బీసీసీఐ. 
 
వేలంలో మొత్తం 164 మంది భారత ఆటగాళ్లు, 125 మంది విదేశీ క్రికెటర్లు అందుబాటులో ఉన్నారు. ఎప్పటిలానే ఈ సారి కూడా ఐపీఎల్ లో 8 జట్లు పోటీపడనున్నాయి. గత నెలలో అత్యధికంగా 10 మందిని బెంగళూరు రిలీజ్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శరవేగంగా వ్యాపిస్తున్న ఎన్‌బి.1.8.1 కరోనా వేరియంట్

23 ఏళ్ల మానసిక వికలాంగురాలిపై తండ్రీకొడుకుల అత్యాచారం.. గర్భం దాల్చడంతో?

Rainfall: తెలంగాణలో కుండపోత వర్షాలు.. జనగాంలో అత్యధిక వర్షపాతం నమోదు

Kamal Haasan: డీఎంకే పొత్తుతో రాజ్యసభకు కమల్.. మైలురాయిగా రాజకీయ జర్నీ

కేసీఆర్ కుటుంబంలో మరో షర్మిలగా ఎమ్మెల్సీ కవిత : ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వర్జిన్ బాయ్స్: యూత్ ని ఫిదా చేస్తున్న పెదవుల తడి సాంగ్ !

దేశం కోసం తపన ఆపరేషన్ సింధూర్ సాంగ్ లో కనిపించింది : జెడి లక్ష్మీనారాయణ

త్రివిక్రమ్ - చెర్రీ కాంబినేషన్‌లో మూవీ?

నాకే ఎందుకు స్వామీ ఈ పరీక్ష : శివయ్యను ప్రశ్నిస్తూ మంచు విష్ణు

పెద్ద మనసుతో ఈ ధరిత్రిని - ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా...

తర్వాతి కథనం
Show comments