Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2022లో కరోనా కలకలం.. పాట్రిక్ ఫర్హత్‌కు కోవిడ్ పాజిటివ్

Webdunia
శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (20:40 IST)
Patrick Farhart
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌లో కరోనా కలకలం రేపింది. ఐపీఎల్ 2022లో కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫిజియో పాట్రిక్ ఫర్హత్‌కు శుక్రవారం కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఐపీఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది.
 
ప్రస్తుతం పాట్రిక్ ప్రత్యేక క్వారంటైన్‌లో ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ వైద్య బృందం ఫర్హత్‌ను పర్యవేక్షిస్తోంది. ముంబైలోని బయో సేఫ్ బబుల్‌లో ఉన్న ఫర్హత్‌కు కరోనా సోకడంతో ఢిల్లీ ప్రాంచైజీ ఆందోళనలో ఉంది.  
 
దీంతో ఏప్రిల్ 16 ఢిల్లీ, ఆర్సీబీ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్యాట్రిక్‌ గతంలో టీమిండియా ఫిజియోగా కూడా పనిచేసిన సంగతి తెలిసిందే.
 
ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందు కేసులు తగ్గుముఖం పట్టడంతో స్టేడియాల్లో 25 శాతం మంది ప్రేక్షకులను అనుమతించాలని నిర్వాహకులు నిర్ణయించారు. ప్రస్తుతం ఐపీఎల్ జట్లు ఇప్పటికీ కఠినమైన బయో బుడగల నీడలో ఉన్నాయి.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments