Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2022లో కరోనా కలకలం.. పాట్రిక్ ఫర్హత్‌కు కోవిడ్ పాజిటివ్

Webdunia
శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (20:40 IST)
Patrick Farhart
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌లో కరోనా కలకలం రేపింది. ఐపీఎల్ 2022లో కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫిజియో పాట్రిక్ ఫర్హత్‌కు శుక్రవారం కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఐపీఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది.
 
ప్రస్తుతం పాట్రిక్ ప్రత్యేక క్వారంటైన్‌లో ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ వైద్య బృందం ఫర్హత్‌ను పర్యవేక్షిస్తోంది. ముంబైలోని బయో సేఫ్ బబుల్‌లో ఉన్న ఫర్హత్‌కు కరోనా సోకడంతో ఢిల్లీ ప్రాంచైజీ ఆందోళనలో ఉంది.  
 
దీంతో ఏప్రిల్ 16 ఢిల్లీ, ఆర్సీబీ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్యాట్రిక్‌ గతంలో టీమిండియా ఫిజియోగా కూడా పనిచేసిన సంగతి తెలిసిందే.
 
ఐపీఎల్ 2022 ప్రారంభానికి ముందు కేసులు తగ్గుముఖం పట్టడంతో స్టేడియాల్లో 25 శాతం మంది ప్రేక్షకులను అనుమతించాలని నిర్వాహకులు నిర్ణయించారు. ప్రస్తుతం ఐపీఎల్ జట్లు ఇప్పటికీ కఠినమైన బయో బుడగల నీడలో ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Xi Mingze: అమెరికాలో చైనా అధ్యక్షుడి కుమార్తె జి మింగ్జే.. బహిష్కరించండన్న ట్రంప్ ఫ్రెండ్

మెడలో రెండు పుస్తెల బంగారు తాడు కోసం మహిళ గొంతు కోసి హత్య

Visakhapatnam: విశాఖపట్నంలో మెట్రో రైలు సేవలు... ప్రారంభానికి ఏపీ సన్నాహాలు

Man: వదిన తలను నరికి చేతుల్లో పట్టుకుని వీధుల్లో తిరిగాడు.. ఆ తర్వాత?

ఆపరేషన్ సిందూర్ పైన అభ్యంతరకర వ్యాఖ్యలు, పోలీసులు 1500 కి.మీ పయనించి లా విద్యార్థిని అరెస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

కలర్ ఫొటో, బేబి మేకర్స్ కొత్త సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments