ఐపీఎల్ 2021: ఫిబ్రవరి 18న వేలం పాట.. వేదికపై ఇంకా..?

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (22:01 IST)
IPL 2021
కాసుల వర్షం కురిపించే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2021 కోసం వేలం పాట త్వరలో ప్రారంభం కానుంది. గత ఏడాది కరోనా కారణంగా లేటుగా ప్రారంభమైన ఐపీఎల్ 2020.. విజయవంతంగా ముగిసింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌ను అట్టహాసంగా నిర్వహించేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఫ్రాంచైజీలన్నీ అట్టిపెట్టుకున్న, విడుదల చేసిన ఆటగాళ్ల జాబితాలను విడుదల చేశాయి. కాగా ఫిబ్రవరి 18న ఐపీఎల్‌ వేలం జరగనుందని సమాచారం.
 
'ఐపీఎల్‌ వేలం ఫిబ్రవరి 18న జరుగుతుంది. వేదిక ఇంకా నిర్ణయించలేదు' అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. అయితే పొట్టి క్రికెట్‌ నిర్వహించే వేదికపై ఇంకా స్పష్టత లేదు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ భారత్‌లోనే ఘనంగా నిర్వహించేందుకు మొగ్గు చూపుతున్నామని చెప్పిన సంగతి తెలిసిందే.
 
కరోనా వైరస్‌ వల్ల గతేడాది ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించారు. అత్యంత ఆసక్తికరంగా సాగిన ఈ పోరులో ముంబై ఇండియన్స్‌ విజేతగా ఆవిర్భవించింది. ట్రోఫీని నిలబెట్టుకుంది. యువకులతో కూడిన దిల్లీ క్యాపిటల్స్‌ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఐపీఎల్‌ రీటెన్షన్‌ తుది గడువు జనవరి 20తో ముగియడంతో జట్లన్నీ అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితా విడుదల చేశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళలపై ట్రాక్టర్ ఎక్కించి.. ఆపై గొడ్డలితో దాడి..

పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం, మాయమాటలు చెప్పి గోదారి గట్టుకి తీసుకెళ్లి...

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

తర్వాతి కథనం
Show comments