రాజస్థాన్‌పై అలవోకగా గెలిచిన గుజరాత్ టైటాన్స్.. యశస్వి రనౌట్‌పై ట్రోలింగ్

Webdunia
శనివారం, 6 మే 2023 (08:50 IST)
ఐపీఎల్‌లో భాగంగా శుక్రవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ జట్టు ఏకంగా ఏడు వికెట్ల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో రాణించి.. రాజస్థాన్‌కు చుక్కలు చూపించింది. దీంతో వరుస విజయాలు సాధిస్తూ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది. 
 
సూపర్ ఫామ్‌లో ఉన్న రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ రనౌట్ కావడం అభిమానులను నిరుత్సాహ పరిచింది. దీంతో అతనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ రనౌట్‌పై ట్రోలింగ్ మొదలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ టీమ్ పవర్ ప్లే ముగిసే సమయానికి 50/1తో పటిష్ట స్థితిలోనే ఉంది. ఈ సమయంలో యశస్వి రనౌట్ కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ 17.5 ఓవర్లలో 118 పరుగులకు కుప్పకూలింది. శాంసన్‌ (30), ట్రెంట్‌ బౌల్ట్‌ (15) టాప్‌ స్కోరర్లు. రషీద్‌ 3, నూర్‌ అహ్మద్‌ 2 వికెట్లు పడగొట్టారు. స్వల్ప లక్ష్యాన్ని గుజరాత్‌ 13.5 ఓవర్లలో 119/1 స్కోరు చేసి అలవోకగా ఛేదించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహం.. పృథ్వీరాజ్ వర్సెస్ శుభలేఖ సుధాకర్

ఎన్డీఏతో చేతులు కలపనున్న టీవీకే విజయ్.. తమిళ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందా?

నారా లోకేష్‌తో పెట్టుకోవద్దు.. జగన్ విమాన ప్రయాణాల ఖర్చు రూ.222 కోట్లు.. గణాంకాల వెల్లడి

బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు

శోభనం రోజు భయంతో పారిపోయిన వరుడు... ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

Sri Nandu: డెమో లాగా సైక్ సిద్ధార్థ షూట్ చేస్తే ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది : శ్రీ నందు

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

తర్వాతి కథనం
Show comments