కోహ్లీ అసహనం... మ్యాచ్ రిఫరీ మందలింపుతో సరి...

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (09:35 IST)
స్వదేశంలో కరోనా వైరస్ మహమ్మారి సంక్రమణ శరవేగంగా సాగుతున్నప్పటికీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ పోటీలు మాత్రం సాఫీగా సాగిపోతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లీ మందలింపునకు గురయ్యాడు. 
 
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచులో అతడు ఐపీఎల్‌ నియమావళిని ఉల్లంఘించడమే ఇందుకుకారణం. ఈ మ్యాచులో విరాట్‌ 29 బంతుల్లో 4 బౌండరీల సాయంతో 33 పరుగులు చేశాడు. 
 
స్కోరు వేగం పెంచే క్రమంలో జేసన్ హోల్డర్‌ వేసిన 12.1వ బంతిని అతడు భారీ షాట్‌ ఆడాడు. బ్యాటు అంచుకు తగిలిన బంతి గాల్లోకి లేచింది. లాంగ్‌ లెగ్‌లో ఉన్న ఫీల్డర్‌ విజయ్‌ శంకర్‌ వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి డైవ్‌ చేసి ఆ క్యాచ్‌ను అద్భుతంగా ఒడిసిపట్టాడు.
 
ఔటైన ఆవేశంలో కోహ్లీ వేగంగా క్రీజ్‌ను వీడాడు. ఈ క్రమంలో అతడు అడ్వర్టైజ్‌మెంట్‌ కుషన్‌, కుర్చీని తన్నేశాడు. అతడు ఐపీఎల్‌ నియమావళిలోని లెవల్‌ 1 నిబంధనలను ఉల్లంఘించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. 
 
దాంతో రిఫరీ వెంగలిల్‌ నారాయణ్‌ కుట్టీ ఆర్‌సీబీ  కెప్టెన్‌ను మందలించాడు. కాగా 2016లో ఇదే బెంగళూరుతో మ్యాచులో గౌతమ్‌ గంభీర్‌ ఇలాగే చేయడంతో అతడి మ్యాచు ఫీజులో 15 శాతం కోత విధించడం గమనార్హం. ఆర్‌సీబీ 149 పరుగులే చేసినప్పటికీ 6 పరుగుల తేడాతో విజయం సాధించడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bhuvaneswari: నారా లోకేష్‌ను అభినందించిన భువనేశ్వరి.. ప్రభుత్వ విద్య అదుర్స్

రెండు రోజుల్లో పెళ్లి.. ఫైనాన్షియర్ల వేధింపులు తాళలేక వ్యక్తి ఆత్మహత్య

స్కూలుకు లేటు.. వీపు మీద బ్యాగ్‌తోనే 100 గుంజీలు.. బాలిక మృతి.. ఎక్కడ?

యేడాదిగా టీచర్లు హేళన చేస్తున్నారు... సారీ మమ్మీ... నా అవయవాలను దానం చేయండి...

Rythanna Meekosam: నవంబర్ 24 నుండి 29 వరకు రైతన్న మీకోసం..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

తర్వాతి కథనం
Show comments