ధోనీ సరికొత్త రికార్డ్.. 150 మందిని ఔట్ చేసిన తొలి వికెట్ కీపర్

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (19:11 IST)
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. తన సుదీర్ఘ క్రికెట్‌ కెరీర్‌లో ఎన్నో రికార్డులు నెలకొల్పిన కెప్టెన్‌ కూల్‌ మహీ ఐపీఎల్‌ చరిత్రలో 150 మందిని ఔట్‌ చేసిన తొలి వికెట్‌ కీపర్‌గా చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ధోనీ నిలిచాడు. ఐపీఎల్‌ 2021లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఈ ఫీట్‌ అందుకున్నాడు. 
 
నితీశ్‌ రాణా క్యాచ్‌ అందుకోవడం ద్వారా మైలురాయి చేరుకున్నాడు. లీగ్‌లో ధోనీ ఇప్పటి వరకు 111 క్యాచ్‌లు అందుకోగా.. 39 స్టంపౌట్‌లు చేశాడు. వికెట్ల వెనుక చురుగ్గా ఉండే ధోనీ క్షణాల్లో స్టంపింగ్‌లు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ధోనీ తర్వాత కోల్‌కతా మాజీ కెప్టెన్‌ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. దినేశ్‌ ఇప్పటి వరకు 112 క్యాచ్‌లు, 31 స్టంపింగ్‌లు చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు బాంబు పేలుడు - వీడియోలు షేర్ చేసి పైశాచికానందం - అస్సాం సర్కారు ఉక్కుపాదం

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నవంబర్ 17 నుంచి భారీ వర్షాలు

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో లగేజ్ చెకింగ్ పాయింట్ వద్ద కుప్పకూలిన వ్యక్తి (video)

AP Gateway: సీఐఐ భాగస్వామ్య సదస్సుకు వ్యాపారవేత్తలకు ఆహ్వానం.. చంద్రబాబు

రక్షిత మంగళం పేట అటవీ భూముల ఆక్రమణ.. పెద్దిరెడ్డికి సంబంధం.. పవన్ సీరియస్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Vijay Kisses Rashimika: రష్మిక మందన్న తో తమ సంబంధాన్ని ప్రకటించిన విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments