Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2020 టోర్నీ నుంచి మిచెల్ మార్ష్ దూరం!!

Webdunia
బుధవారం, 23 సెప్టెంబరు 2020 (11:38 IST)
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన బౌలర్లలో ఒకరైన మిచెల్ మార్ష్ ఐపీఎల్ 2020 టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో ఓడిన బాధలో ఉన్న ఈ జట్టుకు మార్ష్ దూరంకానుండటం మరింత కుంగదీయనుంది. 
 
బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ గాయపడిన విషయం తెల్సిందే. ఈ గాయం పెద్దది కావడంతో మొత్తం ఐపీఎల్‌కే దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌లో అతడు బంతి వేసిన అనంతరం పిచ్‌పై జారి పడ్డాడు. ఈ క్రమంలో కాలి మడమ నొప్పితో విలవిల్లాడాడు. 
 
ఫిజియో వచ్చి చికిత్స చేసినా ఓవర్‌ మధ్యలోనే మైదానం వీడాడు. మార్ష్‌ గాయం చాలా తీవ్రంగానే కనిపిస్తోందని, ఈ స్థితిలో అతను మిగతా మ్యాచ్‌ల్లో బరిలోకి దిగడం అనుమానమేనని జట్టు వర్గాలు తెలిపాయి. మార్ష్‌ స్థానంలో డాన్‌ క్రిస్టియన్‌తో ఒప్పందం కుదుర్చుకునేందుకు సన్‌రైజర్స్‌ ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

kadapa: అరటిపండు ఇస్తానని ఆశ చూపి మూడేళ్ల బాలికపై అత్యాచారం.. ఎక్కడ? (video)

Kerala Woman: నాలుగేళ్ల కుమార్తెను నదిలో పారేసిన తల్లి.. పిచ్చి పట్టేసిందా?

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం!

ఆపరేషన్ సిందూర‌తో పాకిస్థాన్ వైమానిక దళానికి అపార నష్టం!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలం: నిర్మాత ఎస్ కేఎన్

తర్వాతి కథనం
Show comments