ఐపీఎల్ 2020 టోర్నీ నుంచి మిచెల్ మార్ష్ దూరం!!

Webdunia
బుధవారం, 23 సెప్టెంబరు 2020 (11:38 IST)
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన బౌలర్లలో ఒకరైన మిచెల్ మార్ష్ ఐపీఎల్ 2020 టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో ఓడిన బాధలో ఉన్న ఈ జట్టుకు మార్ష్ దూరంకానుండటం మరింత కుంగదీయనుంది. 
 
బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ గాయపడిన విషయం తెల్సిందే. ఈ గాయం పెద్దది కావడంతో మొత్తం ఐపీఎల్‌కే దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌లో అతడు బంతి వేసిన అనంతరం పిచ్‌పై జారి పడ్డాడు. ఈ క్రమంలో కాలి మడమ నొప్పితో విలవిల్లాడాడు. 
 
ఫిజియో వచ్చి చికిత్స చేసినా ఓవర్‌ మధ్యలోనే మైదానం వీడాడు. మార్ష్‌ గాయం చాలా తీవ్రంగానే కనిపిస్తోందని, ఈ స్థితిలో అతను మిగతా మ్యాచ్‌ల్లో బరిలోకి దిగడం అనుమానమేనని జట్టు వర్గాలు తెలిపాయి. మార్ష్‌ స్థానంలో డాన్‌ క్రిస్టియన్‌తో ఒప్పందం కుదుర్చుకునేందుకు సన్‌రైజర్స్‌ ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండిగో సంక్షోభంపై నోరెత్తిన కేటీఆర్.. సంపద కొన్ని సంస్థల చేతుల్లోనే కూరుకుపోయింది..

పుతిన్-మోడీ ఫ్రెండ్‌షిప్‌ని మా ట్రంప్ దృఢతరం చేసారు, ఇవ్వండి నోబెల్ అవార్డ్, ఎవరు?

పరకామణిలో తప్పు చేసాను, నేను చేసింది మహా పాపం: వీడియోలో రవి కుమార్ కన్నీటి పర్యంతం

Jogi Ramesh: లిక్కర్ కేసు.. జోగి రమేష్‌పై ఛార్జీషీట్ దాఖలు చేసిన సిట్

అందుకే నేను చెప్పేది, పవన్ సీఎం అయ్యే వ్యక్తి, జాగ్రత్తగా మాట్లాడాలి: ఉండవల్లి అరుణ్ కుమార్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

తర్వాతి కథనం
Show comments