Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూఏఈ వేదికగా సెప్టెంబరులో ఐపీఎల్ - 51 రోజుల పాటు కాసుల పోటీలు

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (09:21 IST)
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్2020) పోటీలు వచ్చే సెప్టెంబరు నుంచి యూఏఈ వేదికగా ప్రారంభంకానున్నాయి. నిజానికి ఇదే నెలలో ఐసీసీ నిర్వహించే ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీలు జరగాల్సివుంది. కానీ, కరోనా వైరస్ భయం కారణంగా ఈ పోటీలకు ఆతిథ్యం ఇవ్వాల్సిన క్రికెట్ ఆస్ట్రేలియా చేతులెత్తేసింది. దీంతో ఈ పోటీలను ఐసీసీ వచ్చే యేడాదికి వాయిదావేసింది. దీంతో ఐపీఎల్ పోటీల నిర్వహణకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. 
 
ఈ పోటీల నిర్వహణకు దేశంలో ఈ యేడాది ఆఖరు వరకు పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా ఉండబోవని బీసీసీఐ భావిస్తోంది. దీంతో పోటీలను యూఏఈలో జరపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 మధ్య ఈ పోటీలు జరిగే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
 
ఈ విషయమై అన్ని ఫ్రాంచైజీలకూ బీసీసీఐ నుంచి సమాచారం వెళ్లిందని, పోటీల నిర్వహణపై వారి సలహాలు, సూచనలు కూడా తీసుకోనున్నామని ఓ అధికారి వెల్లడించారు. పోటీలు 51 రోజుల పాటు సాగుతాయి కాబట్టి, ప్రసార హక్కులను పొందిన కంపెనీలు, ఇతర వాటాదారులకు సైతం ఎటువంటి అభ్యంతరాలూ ఉండబోవని భావిస్తున్నట్టు పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఆ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.
 
వాస్తవానికి సెప్టెంబర్ 26 నుంచి ఈ పోటీలను ప్రారంభిస్తారని తొలుత వార్తలు వచ్చినప్పటికీ, ఐపీఎల్ ముగియగానే, ఆస్ట్రేలియా పర్యటనకు భారత క్రికెట్ జట్టు వెళ్లాల్సి వుండటం, ఆ దేశ ప్రభుత్వ నిబంధనల మేరకు ఆసీస్ వెళ్లిన ఆటగాళ్లంతా 14 రోజుల క్వారంటైన్ పాటించడం తప్పనిసరి కావడంతో, ఓ వారం ముందుగానే ఐపీఎల్‌ను ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక ఈ విషయంలో నేడో, రేపో అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments