Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2020 : ఆధిపత్య పోరులో చతికిలపడిన కోహ్లీ సేన... అగ్రస్థానంలో ఢిల్లీ!

IPL 2020
Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2020 (08:22 IST)
యూఏఈ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీల్లో భాగంగా, సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇరు జట్ల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలోని బెంగుళూరు జట్టు చతికిలపడింది. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానం కోసం ఈ ఇరు జట్లూ తలపడగా, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 159 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. తద్వారా మొత్తం నాలుగు విజయాలతో ఢిల్లీ జట్టు ఎనిమిది పాయింట్లను తన ఖాతాలో వేసుకుని అగ్రస్థానంలో కొనసాగుతోంది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 196 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్‌ స్టాయినీస్‌(53 నాటౌట్‌:  26 బంతుల్లో 6ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్థశతకంతో చెలరేగగా ఓపెనర్లు పృధ్వీషా 42, శిఖర్ ధావన్ 32లు బలమైన పునాది వేశారు. ఆ తర్వాత రిషబ్‌ పంత్‌ (37:25 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) రాణించాడు. చివర్లో స్టాయినీస్‌ ఎప్పటిలాగే వీరవిహారం చేశాడు. ఫలితంగా 196 పరుగులు భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి జట్టు ముంగిట ఉంచింది. బెంగళూరు బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌ రెండు వికెట్లు పడగొట్టగా, ఉడానా, మొయిన్‌ అలీ చెరో వికెట్‌ తీశారు.
 
ఆ తర్వాత 197 పరుగుల భారీ లక్ష్య ఛేదనను బెంగళూరు దారుణంగా ఆరంభించింది. పవర్‌ప్లేలోనే దేవదత్‌ పడిక్కల్‌ (4), అరోన్‌ ఫించ్‌ (13), డివిలియర్స్‌ (9) వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కోహ్లీ కాసేపు వేగం కనబరిచాడు. అయితే, రబాడ వేసిన 14వ ఓవర్లో విరాట్‌ వికెట్‌ కీపర్‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరగడంతోనే బెంగళూరు ఓటమి దాదాపు ఖాయమైంది. ఆ తర్వాత ప్రత్యర్థి బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో వరుస విరామాల్లో పెవిలియన్‌ బాటపట్టారు. రబాడ పదునైన బంతులకు బెంగళూరు జట్టు కోలుకోలేకపోయింది. ఫలితంగా 24 పరుగులిచ్చి ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి, ఆర్సీబీ వెన్ను విరిచాడు. దీంతో బెంగుళూరు జట్టు దారుణంగా విఫలమైంది. 
 
నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్లను కోల్పోయిన ఆర్సీబీ 137 పరుగులకు మాత్రమే పరిమితమై, పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్ కు 2 వికెట్లు, మొయిన్ అలీ, ఉదానాకు చెరో వికెట్ లభించాయి. ఈ విజయం ఢిల్లీకి నాలుగోది కాగా, 8 పాయింట్లతో అగ్రస్థానంలోకి వెళ్లింది. రాయల్ చాలెంజర్స్‌కు ఇది రెండో ఓటమి కావడం గమనార్హం.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

తర్వాతి కథనం
Show comments