Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ హిస్టరీలో ఆ పని చేసిన తొలి బ్యాట్స్‌మెన్ అతనే... (video)

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2020 (16:16 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఓ అరుదైన రికార్డు నమోదైంది. ఈ రికార్డును ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధవాన్ నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలోనే వరుసగా రెండు సెంచరీలు బాదిన ఏకైన ఆటగాడిగా తన పేరును లిఖించుకున్నాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 101 రన్స్, పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 106 పరుగులు చేసి అజేయంగా నిలవడం గమనార్హం. 
 
ఐపీఎల్ 2020 టోర్నీలో భాగంగా, మంగళవారం రాత్రి కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడింది. ఈ మ్యాచ్‌లో 57 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో శతకం పూర్తి చేసుకోగా, 61 బంతుల్లో 106 పరుగులు చేసి నాటౌట్‌గా నిలించాడు. 
 
అలాగే, చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ధవాన్ సెంచరీ బాదాడు. ఈ మ్యాచ్‌లో 58 బంతుల్లో 14 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇన్నింగ్స్‌ ఆద్యంతం క్రీజులో నిలుస్తున్న ధవాన్... ప్రత్యర్థి బౌలర్లపై యధేచ్ఛగా ఎదురుదాడి చేస్తూ జట్టును ఒంటిచేత్తో గెలిపించిన విషయం తెల్సిందే. 
 
కాగా, గత సీజన్‌లో ఈ ఎడమచేతివాటం ఆటగాడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఆడాడు. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ధవాన్‌ను కొనుగోలు చేసింది. ఈ సీజన్ ఆరంభంలో కాస్త తడబడిన శిఖర్ ధవాన్... ఇపుడు బౌలర్లకు చుక్కలు చూపిస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. 
 
అంతేకాకుండా, కేవలం సెంచరీల పరంగానేకాకుండా పరుగుల్లోనూ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో ఐదు వేల పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో ధవాన్ చోటు దక్కించుకున్నాడు. ఈ పట్టికలో ధవాన్ ఐదో స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ (5759), సురేష్ రైనా (5368), రోహిత్ శర్మ  (5158), డేవిడ్ వార్నర్ (5037)లు ఉన్నారు. కాగా, 5 వేల పరుగుల క్లబ్‌లో చేరేందుకు డేవిడ్ వార్నర్‌కు 135 ఇన్నింగ్స్ అవసరం కాగా, కోహ్లీకి 157, ధవాన్‌కు 168 ఇన్నింగ్స్ అవసరమయ్యాయి. 
 

సంబంధిత వార్తలు

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments